Don't Miss!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్: అఫైర్ల మీదే అందరికీ ఆసక్తి..గత పదేళ్లలో తొలిసారి అలాంటి అనుభవం..రెజీనా షాకింగ్ కామెంట్స్
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్గా మారిన వార్తలు మీ కోసం.
సుశాంత్పై విష ప్రయోగం జరిగిందా? పోలీసుల చేతికి విసేరా రిపోర్టు.. అనుమానాలపై క్లారిటీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ముంబై పోలీసులు దృష్టిపెట్టారు. ఈ యువ నటుడి మరణం తర్వాత రోజు రోజుకు సందేహాలు జోరందుకోవడంతో వీలైనంత మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇలాంటి క్రమంలోనే గతవారం పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టును కూపర్ హాస్పిటల్ వైద్యబృందం నుంచి అందుకొన్న ముంబై పోలీసులు పలువురిని విచారించారు. తాజాగా బాంద్రా పోలీసుల చేతికి విసేరా రిపోర్టు అందింది. ఈ ఆ రిపోర్టులో ఏమున్నదంటే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అఫైర్ల మీదే అందరికీ ఆసక్తి.. అలాంటి ప్రశ్నలపై చిర్రెత్తిన ఇలియానా
గోవా సుందరి ఇలియానా తెలుగు ప్రేక్షకులను తొలి చూపులోనే కట్టిపడేసింది. దేవదాస్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఇలియానా.. తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. టాలీవుడ్లో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్గా ఇలియానా రికార్డులకెక్కిందని అప్పట్లో టాక్ వినిపించింది. అంతటి స్టార్డమ్ సంపాదించుకున్న ఇలియానా.. బాలీవుడ్ బాట పట్టింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వామ్మో చీరకట్టు... లేడీస్ మీకు దండాలు.. చీర కష్టాలను చెప్పిన అక్షయ్
లక్ష్మీబాంబ్ చిత్రంపై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ సూపర్స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. తాము ఏ కమ్యూనిటీ మనోభావాలను కించపరిచే విధంగా సినిమాను రూపొందించలేదని క్లారిటీ ఇచ్చారు. గత మూడు దశాబ్దాల కెరీర్లో తాను ఇలాంటి పాత్రను ఇప్పటి వరకు పోషించలేదు. ఈ చిత్రంలోని ట్రాన్స్జెండర్ పాత్రను మానసిక పరిపక్వతతో పోషించాను అని అక్షయ్ కుమార్ తెలిపారు. కరోనా కారణంగా ఈ సినిమాను డిస్నీ+హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించామని పేర్కొన్నారు. లక్ష్మీబాంబ్ చిత్రం డిస్నీ+హాట్స్టార్ ఓటీటీపై రిలీజ్ కానున్న సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ...
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘నా భర్త తాగుబోతు.. ఆడవాళ్ల పిచ్చి.. షూటింగు కోసం పెళ్లి అని మోసం’
ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ పెళ్లి వివాదం కొత్త మలుపు తిరుగుతున్నది. వనితా విజయ్ కుమార్ తాజాగా పెళ్లి చేసుకొన్న భర్త పీటర్ పాల్ భార్య ఎలిజబెత్ హెలన్ కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. జూన్ 27వ తేదీన వనితా, పీటర్ పాల్ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం తెలిసిందే. అనంతరం ఎలిజబెత్ హెలెన్ చెన్నైలోని వడపళని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హెలెన్ మాట్లాడుతూ..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నిర్మాత పీవీపీ నిర్వాకంపై మరో కేసు.. అరెస్ట్ కోసం వెళితే.. పోలీసులపై కుక్కలను ఉసిగొల్పిన వైసీపీ నేత
ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీపై మరో కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం తనపై దాడి చేశారంటూ పీవీపీపై బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 82లోనో ఓ ఇంటి యజమాని విక్రమ్ కైలాస్ ఫిర్యాదు చేయడం తెలిసిందే. భూవివాదంపై గొడవలో తనను వేధిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పీవీపీ దురుసుగా ప్రవర్తించడం పోలీసుల ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలో ఆయనపై మరో కేసును నమోదు చేయడం సంచలనంగా మారింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కిస్ అంటేనే భయమేస్తోంది.. రొమాన్స్ చేయకుండా ఉంటేనే బెటర్.. రెజీనా షాకింగ్ కామెంట్స్
హాట్
అండ్
క్యూట్
హీరోయిన్
గా
టాలీవుడ్
లో
తనకంటూ
ఒక
ప్రత్యేకమైన
క్రేజ్
అందుకున్న
బ్యూటీ
రెజీనా
కసండ్రా.
ఈ
మధ్య
కాలంలో
ఈ
బ్యూటీ
ఎక్కువగా
వార్తల్లో
నిలుస్తోంది.
కరోనా
టైమ్
లో
జనాల
దృష్టి
తనపై
పడటం
లేదు
అనుకుంటుందో
ఏమో
గాని..
ఎవరు
ఉహీంచని
కామెంట్స్
చేస్తూ
జనాలను
తనవైపుకు
తిప్పుకుంటోంది.
ఇటీవల
ముద్దంటే
భయం
అంటూ
మరో
షాకింగ్
కామెంట్
చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రోడ్డున పడిన మరో యాక్టర్.. ఒకప్పుడు అమీర్ ఖాన్ ఫ్రెండుగా.. ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటూ..
సినిమా ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా ఎక్కువ కాలం పని దొరకుతుందన్న గ్యారెంటి లేదు. కొన్నిసార్లు అవకాశాలు తగ్గిపోతుంటాయి. రాజభోగాలు అనుభవించిన ఎంతో మంది స్టార్స్ పాతాళానికి పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రతి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇంకా ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. ఇక కరోనా దెబ్బకు షూటింగ్స్ తగ్గిపోవడంతో మరో నటుడికి కూడా రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గత పదేళ్లలో తొలిసారి అలాంటి అనుభవం.. హీరోయిన్ పూర్ణ సెన్సేషన్ కామెంట్స్
అవును, సీమటపాకాయ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అందాల భామ పూర్ణ. పూర్ణ అసలు పేరు షామ్నాకాశిం. ఆమె పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కేరళలోనే. ఈ కేరళ కుట్టి 2007 లో వచ్చిన శ్రీ మహాలక్ష్మితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై అవును చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. తమిళ, మళయాలంలో మంచి పాత్రలను పోషించి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అయితే గత కొన్ని రోజులుగా పూర్ణ వార్తల్లో నిలుస్తోంది. డబ్బులివ్వాలని కొందరు తనను బెదిరిస్తున్నారని, చంపుతామని ఫోన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అన్ని ఇండస్ట్రీల్లో బాగా వైరల్ అయింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
షాకిస్తున్న RGV బిజినెస్ మైండ్.. 5లక్షల పెట్టుబడితో కోట్లల్లో లాభాలు.. ఇంకా కుప్పలుకుప్పలుగా ఉన్నాయట
విలక్షన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే అనే మాట ఇటీవల కాలంలో చాలా సాధారణంగా మారిపోయింది. వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతున్న వర్మ మరోవైపు షూటింగ్స్ ని కూడా గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నాడు. అయితే వర్మ పెట్టుబడికి వచ్చిన లాభాలను చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మనుషులు పూర్తిగా అది కోల్పోయారా?.. దారుణ ఘటనపై సింగర్ స్మిత ఫైర్
ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా విడమరిచి చెప్పనక్కర్లేదు. కరోనా విజృంభణకు పోలీసులు, డాక్టర్లు అని తేడా లేకుండా అందరూ తలొంచాల్సి వస్తోంది. కరోనాను ఎదిరించడానికి ప్రస్తుతం ఫేస్ మాస్క్ మాత్రమే అనివార్యమైంది. ప్రభుత్వాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని ఓ కింది స్థాయి మహిళా ఉద్యోగి పైస్థాయి అధికారికి చెబితే కోపం వచ్చింది. దీంతో ఆ మహిళను సదరు ఉద్యోగి దారుణంగా చితక బాదాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.