Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Trending: సుశాంత్ మాజీ ప్రేయసి షాకింగ్ ట్వీట్.. సోనూ సూద్ ఆస్తులేంతంటే..ఆ హీరో భార్యతో అక్రమ బంధం
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్గా మారిన వార్తలు మీ కోసం.
లాక్ డౌన్లో అక్రమంగా తన నివాసంలోనే దందా.. ప్రముఖ నటుడు అరెస్ట్
సెలెబ్రిటీలు దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని బాగా ఫాలో అవుతుంటారు. అందుకే లైమ్ లైట్లో ఉండగానే వ్యాపార రంగంలోకి దిగుతారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, క్లబ్, పబ్స్ అంటూ ఒక్కో దాంట్లో పెట్టుబడి పెడతారు. మన తెలుగు తారలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. అయితే కిక్ ఫేమ్ శ్యామ్ కూడా ఓ క్లబ్ను నిర్వహిస్తున్నాడు. అందులో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు జూలు విదిల్చారు. శ్యామ్ను అరెస్ట్ చేశారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ మోసం చేసినవాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్.. వదిలేదే లేదు: సింగర్ సునీత
సింగర్ సునీత ఎంత కూల్ గా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా చాలా కూల్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక రూమర్స్ డోస్ ఎక్కువైతే ఆమె అఫీషియల్ గా వివరణ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అయితే ఇటీవల మోసం చేసిన ఒక వ్యక్తిపై సింగర్ సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోను అంటూ తప్పకుండా అతనిపై పిర్యాదు చేస్తానని కూడా వివరణ ఇచ్చారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీరు చాలా దూరం పోయారు.. ఇక ఊరుకునేదిలేదు.. అలాంటి వాటిపై పునర్నవి లీగల్ యాక్షన్
సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం కామన్.. హాట్ హాట్ ఫోటోలను ఫాలోవర్స్ను ఆకర్షించడమూ కామన్. కొందరు యోగా, మరికొందరు వర్కౌట్లు ఇలా ఏదో ఒకటి చేస్తూ తమ ఫాలోవర్స్ను పెంచుకుంటూ ఉంటారు.అయితే ఆ వర్కౌట్లు, యోగాలు చేసేప్పుడు బయటకు వచ్చే ఫోటోలు ఒక్కోసారి వైరల్ అవుతుంటాయి. ట్రోల్స్ జరుగుతుంటాయి. అలానే తాజాగా పునర్నవి యోగ చేస్తూ తన ఫాలోవర్స్కు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తోంది. అయితే ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సుశాంత్ మృతి వెనుక భారీ కుట్ర.. సీబీఐకి అప్పగించాలి.. గళమెత్తిన బీజేపీ ఎంపీ, ఫ్యామిలీ
బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసు మరో మలుపు తిరిగింది. సుశాంత్ సింగ్ మరణానికి కారణంపై ముంబై పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై ఆయన కుటుంబ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ సోమ, మంగళవారాల్లో బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు డ్రామా ముంబై నుంచి బీహార్కు మారింది. ఈ కేసు తాజా మలుపు గురించిన విషయాల్లోకి వెళితే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆద్య విషయంలో అలా జరిగితే అది నా బాధ్యత కాదు.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
పవన్ కళ్యాణ్ భార్యగా కంటే మాజీ భార్యగా రేణూ దేశాయ్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్తో విడాకులు, పుణెలో సెటిల్ అవ్వడం, రెండో పెళ్లికి రెడీ అవ్వడం, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇక రెండో పెళ్లి విషయంలోనైతే రెండు వర్గాలుగా చీలి మరి వాగ్వాదానికి దిగారు. ఈ మధ్య కాస్త వాటన్నంటికి దూరంగా ఉంటోంది రేణూ దేశాయ్. ఆ మధ్య హైద్రాబాద్లో ఇంటిని కొనుగోలు చేసిన విషయంలోనూ వివాదం చెలరేగింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ తన పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రియాకు, మహేష్ భట్ మధ్య ఆ బంధం.. సుశాంత్ మరణానికి ముందు అక్కడి నుంచి జంప్.. కంగన సంచలన ట్వీట్
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై దాఖలైన కేసు దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలు మంగళవారం చోటుచేసుకొన్నాయి. ఊహించని విధంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆయన కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయడం సంచలనం రేపుతున్నది. ఈ క్రమంలో రియా, మహేష్ భట్ సంబందాలపైపై కంగన రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగన చేసిన ట్వీట్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే...
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హాట్ టాపిక్గా సోనూ సూద్ ఆస్తుల విలువ.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఖర్చు చేశాడంటే?
బాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ఇలా బాషాభేదం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసిన నటుడు సోనూ సూద్. దాదాపు 20ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం రియల్ హీరోల కంటే హై రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నాడు. లాక్ డౌన్ ముందు వరకు అతను వెండితెరపై కనిపించే విలన్. కానీ ఇప్పుడు మన ముందుకు వచ్చిన రియల్ హీరో. గత కొన్ని రోజులుగా ప్రాంతీయ బేధం లేకుండా సహాయలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే సోనూ సూద్ ఆస్తుల విలువ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భయంతో ఖరీదైన లాయర్ని సెట్ చేసుకున్న రియా.. ముందస్తు బెయిల్ కోసం ప్లాన్!
నెలరోజుల దాటినా ఇంకా సుశాంత్ సింగ్ మృతికి గల అసలు కారణాలు తెలియరాలేదు. కానీ రోజుకో అనుమానం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. పోలీసుల విచారణలో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక మొన్నటివరకు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి కేసుతో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ మంగళవారం సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ కేసు నమోదు చేయడంతో సరికొత్త సంచలనానికి దారి తీసింది. దీంతో రియాలో భయం కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ హీరో భార్యతో అక్రమ సంబంధం.. పారిశ్రామికవేత్త క్లారిటీ.. యాక్టర్ వార్నింగ్
హాలీవుడ్ యాక్టర్లు జానీ డెప్, అంబర్ హర్డ్ మధ్య గొడవలు సరికొత్త మలుపులు తిరుగుతూ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విడాకులు తీసుకొన్న ఈ స్టార్ యాక్టర్ల వివాదంలోకి అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన భార్యతో సంబంధం పెట్టుకొన్నందుకు అంగం కట్ చేస్తానని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకొన్ని నవ్వుకున్నారు. అంబర్ హర్డ్తో రిలేషన్షిప్ గురించి ఎలాన్ మస్క్ స్పందిస్తూ..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Recommended Video
నిజం నిప్పులాంటిది.. ఎప్పటికైనా అదే గెలుస్తుంది.. సుశాంత్ మాజీ ప్రేయసి షాకింగ్ ట్వీట్.. రియాపై కేసు
దివంగత సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు దర్యాప్తులో వేగంగా మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ముంబై పోలీసులతోపాటు బీహార్ పోలీసుల కూడా రంగంలోకి దిగారు. సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో చూపంతా రియా వైపు మరలింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తు తన ప్రేయసి రియా చక్రవర్తి మెడకు చుట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ ప్రేయసి చేసిన ట్వీట్ వైరల్గా మారింది.. అంకితా లోఖండే చేసిన ట్వీట్ ఏమిటంటే..