Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్రెండింగ్:పెళ్లి గంటలు మోగాయ్..ఎట్టకేలకు భార్యకు దగ్గరగా..వచ్చింది శోభనం కోసం కాదంటూ గాలి తీసేశాడు
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్గా మారిన వార్తలు మీ కోసం.
Recommended Video
క్వారంటైన్ కష్టాలు తప్పాయ్.. ఎట్టకేలకు భార్యకు దగ్గరగా.. కౌగిలింతలో మెగా అల్లుడు బంధీ!
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఎట్టకేలకు తన క్వారంటైన్ను పూర్తి చేసుకున్నాడు. లాక్ డౌన్లో షూటింగ్ కోసం బయటకు వెళ్లిన కళ్యాణ్ దేవ్ కరోనా భయంతో క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు. దాంతో ఫ్యామిలీకీ దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు శ్రీజ పెద్ద కూతురు నివృత్తి బర్త్ డేను కూడా సెలెబ్రేట్ చేయలేకపోయాడు. కూతురు పుట్టిన రోజును జరపలేకపోతున్నందున కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ అయ్యాడు. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ ఫ్యామిలీతో కలిసిపోయాడు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బికినీలో అనుష్క శర్మ.. భార్య అందాలకు విరాట్ కోహ్లీ ఫిదా.. అలియా క్రేజీగా కామెంట్!
బాలీవుడ్ తార అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీల దాంపత్య జీవితం లాక్డౌన్లో రసవత్తరంగా సాగుతున్నది. చిలిపి చేష్టలు, సరసాలతో గత 100 రోజులుగా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ సెలబ్రిటీ జంట తమ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకొంటూ నెటిజన్లకు, అభిమానులకు దగ్గరవుతున్నారు. తాజాగా అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన బికినీ ఫోటో వైరల్ కాగా.. దానికి విరాట్ గమ్మత్తైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంటర్నెట్లో దుమారం రేపారు. ఇంతకు విరాట్ ఏం చేశారంటే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పెళ్లి గంటలు మోగాయ్.. అన్ని విషయాలు వెల్లడించిన మిహీక.. వెరైటీ వెడ్డింగ్ కార్డ్!!
దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. టాలీవుడ్ మెస్ట్ వాంటెడ్ బ్యాచ్లర్ లిస్ట్లోంచి రానా తప్పుకోబోతోన్నాడు. ఆగస్టు 8న రానా తన ప్రేయసి మిహీకా బజాజ్తో వివాహం జరగబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అందరికీ ఇంత వరకే తెలియగా.. మిహీకా తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది. పెళ్లి ఎక్కడ, అతిథులు ఎవరు? పెళ్లి తరువాతి కార్యక్రమాలు ఏంటి? ఇలా అన్నింటితో పాటు అసలు వారికి ఎలా పరిచయమైంది అనే విషయాన్ని కూడా వెడ్డింగ్ కార్డ్లో పెట్టేశారు. అయితే ఇప్పుడు డిజిటల్ యుగం కాబట్టి వీటన్నంటిని ఓ వీడియో రూపంలో చేసి అందరికీ పంపించబోతోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సుశాంత్ మరణం వెనుక దావూద్ ఇబ్రహీం.. మాజీ RAW ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటనేది ఇంత వరకు బయటపడలేదు. రోజుకో వార్త జనాల్లో కొత్త అనుమానాలను కలిగిస్తోంది. ఇక సుశాంత్ సింగ్ తో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా విచారిస్తున్న అధికారులు కూడా కేసు ఎంతవరకు వచ్చింది అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇక ఇటీవల మాజీ RAW ఏజెంట్ సుశాంత్ సింగ్ మృతిపై కొత్త తరహా అనుమానాలను లేవనెత్తారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్.. వాళ్ళు ఎక్కడున్నారంటే?
ఇండియాలో కరోనా వైరస్ రోజురోజుకి మరింత విస్తరిస్తోంది. సాదారణ జనాల నుంచి సెలబ్రెటీల వరకు వైరస్ ప్రతి ఒక్కరిని భయాన్ని కలిగిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినీ తారలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కూడా కరోనా రావడం షాక్ కి గురి చేస్తోంది. అయితే మొదటిసారి బచ్చన్ ఫ్యామిలీ ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దేవుడు చచ్చిపోయాడు.. రజినీకాంత్ మాటలకు కౌంటర్ ఇచ్చిన నాగబాబు
సినీ నటుడు నాగబాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఆయన దేవుడు అనే కాన్సెప్ట్ చుట్టూ ఉహీంచని విధంగా స్పందించడం వైరల్ గా మారింది. గతంలో హిందు ధర్మ దేవుళ్లపై విమర్శలు చేసిన వారిపై ఘాటుగా స్పందించిన నాగబాబు ఈసారి మాత్రం దేవుడు అనే వాడే లేడు అంటూ కామెంట్ చేశారు. అదే విధంగా గతంలో రజినీకాంత్ చెప్పిన మాటలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కపూర్ల ఇంటిలో దెయ్యాల తిష్ట.. కూల్చివేతకు సిద్ధం.. రణ్బీర్ కపూర్కు ఆ సర్కార్ షాక్
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కపూర్ కుమారుడు దిగ్గజ దర్శక, నిర్మాత, నటుడు రాజ్ కపూర్ పాకిస్థాన్లోని పేషావర్ జన్మించారు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం ముంబై వచ్చి సెటిల్ అయ్యారు. బాలీవుడ్లోపాగా వేసిన మొట్టమొదటి ఫ్యామిలీ కపూర్లదే. ఇప్పటికి వారి వారసత్వ మూలాలు అక్కడ ఉన్నాయి. ఈ క్రమంలో వారికి వారసత్వంగా సంక్రమించిన భవనాలు, ఆస్తులు పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పుకొంటారు. అయితే అలాంటి వారసత్వ భవనాన్ని పాక్ ప్రభుత్వం కూల్చివేతకు పాల్పడుతున్నారనే వార్త ఫ్యామిలీ కుటుంబంలో ఆవేదనకు గురిచేస్తున్నది. వివరాల్లోకి వెళితే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రష్మీ ఇంటికి సుడిగాలి సుధీర్: వచ్చింది శోభనం కోసం కాదంటూ గాలి తీసేశాడు.!
అద్భుతమైన గ్లామర్తో తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్గా వెలుగొందుతోంది జబర్ధస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్. యాక్టింగ్, డ్యాన్స్, మ్యాజిక్ ఇలా అన్ని రకాల విద్యలను ప్రదర్శిస్తూ ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు సుడిగాలి సుధీర్. వృత్తి పరంగా ఫుల్ బిజీగా ఉన్న ఈ ఇద్దరూ.. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నవారే. వాస్తవానికి విడివిడిగా కంటే ఇద్దరూ కలిసే బాగా పాపులర్ అయ్యారు. అందుకే వీళ్లిద్దరిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ ఇంట్లో సుధీర్ కనిపించి షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం.!
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వనిత మూడో పెళ్లి వివాదం కొత్త మలుపు.. ఆమెపై కేసు.. సైబర్ మాఫియా గుట్టు విప్పుతా అంటూ..
తమిళ చిత్రపరిశ్రమలో వనితా విజయ్ కుమార్ పెళ్లి వివాదంలో కొత్త ట్విస్టు చోటుచేసుకొన్నది. తాను మూడో పెళ్లి చేసుకోవడంపై పలువురు చేస్తున్న కామెంట్లకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. తనను టార్గెట్ చేస్తున్న వారి నిజ స్వరూపాలు బయటపెడుతానని అర్ధరాత్రి ట్వీట్లు చేయడంతో తమిళ సినీరంగంలో హల్చల్ మొదలైంది. మంగళవారం సంచలన రీతిలో పోలీస్ స్టేషన్లోనే ప్రెస్మీట్ పెడుతానని ట్వీట్ చేయడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి మొదలైంది. వివరాల్లోకి వెళితే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సుశాంత్ నీవు ఈ లోకం వీడి 30 రోజులు.. ఇంకా ఆ బాధలోనే మాజీ ప్రియురాళ్ల ఎమోషనల్ పోస్ట్
సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన దేశాన్ని కుదిపేసింది. జూన్ 14న తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుశాంత్ మరణంపై భిన్న కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మేరకు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్స్ రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సుశాంత్ మరణం వెనుకున్నది ఎవ్వరో ప్రపంచానికి తెలియాలని నెటిజన్స్, ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే సుశాంత్ మరణించి నేటికి 30 రోజులు అవుతోంది. ఈ సందర్భంగా సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, అంకితా లోఖండే ఎమోషనల్ అయ్యారు.