Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ట్రెండింగ్ : నీవో వీధి కుక్కవు.. ఆదాయానికి మించి ఆస్తులు.. అర్నబ్పై వర్మ దారుణంగా కామెంట్స్
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్గా మారిన వార్తలు మీ కోసం.
‘సుశాంత్ దేహం సీలింగ్కు వేలాడలేదు.. ముమ్మాటికి హత్యే.. సీఎం కొడుకు హస్తం?'
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసుకు సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలా? వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనలను బలంగా వినిపించారు. సుశాంత్ మరణం ఆత్మహత్య కాదు.. మర్డర్ జరిగిందనే కోణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వాదనలు వినిపించారు. వికాస్ సింగ్ వాదనలకు సంబంధించి..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదహారేళ్ల వయసులో ‘పాంచాలి'.. దానికి అంతం లేదు.. రాధికపై డైరెక్టర్ కామెంట్స్
తెలుగు తెరపైనే కాకుండా దాదాపు అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుకుంది రాధిక. అయితే తమిళంలో పదహారేళ్ల వయసులోనే కెరీర్ను మొదలుపెట్టింది. అది కూడా దర్శకదిగ్గజం భారతీ రాజా దర్శకత్వంలోనే కెరీర్ను మొదలుపెట్టింది. ఆగస్ట్ 10 నాటికి రాధికా నటిగా 42 ఏళ్లు పూర్తి కావడంతో తెగ ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తన ప్రయాణం ఇంత వరకు సాగుతుందని ఊహించలేదని అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రియా చక్రవర్తి గోల్మాల్.. ఆదాయానికి మించి ఆస్తులు.. ఆ రెండు బ్యాంకులపై ఈడీ నజర్!
బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి సంబంధించిన ఆస్తులు ఆదాయానికి మించి ఉండటంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) తీవ్రంగా పరిగణిస్తున్నది. ఆదాయానికి మంచి ఆస్తులు ఉండటంపై అడిగిన లెక్కలకు రియా పొంతన లేని సమాధానాలివ్వడం, జవాబు దాటవేసేందుకు ప్రయత్నించడం ఈ కేసులో సీరియస్గా మారింది. తన కుమారుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం జరిగిందని తండ్రి కేకే సింగ్ పాట్నాలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయడంతో రియాను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పూర్తి
వివరాల
కోసం
ఇక్కడ
క్లిక్
చేయండి
చేయని నేరానికి శిక్ష వేయొద్దు.. మంచి పనిని ప్రమోట్ చేయండి.. జబర్దస్త్ అభి ఝలక్
కారు యాక్సిండెట్ కారణమంటూ మీడియాలో వస్తున్న వార్తలపై జబర్దస్త్ ఫేం అభి అలియాస్ అభినయ్ కృష్ణ స్పందించారు. కారు ప్రమాదం విషయం మీడియాలో రావడంతో నా ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు, స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. ఆ వార్త తెలియగానే నేను కూడా డిస్ట్రబ్ అయ్యానను అంటూ అభి తాజాగా వీడియోను రిలీజ్ చేశారు. చేయని నేరానికి శిక్ష వేయొద్దు.. మంచి పనిని ప్రమోట్ చేయండి అనే విధంగా వీడియోలో పేర్కొన్నారు. తనకు, కారు ప్రమాదానికి సంబంధం లేదంటూ వివరణ ఇస్తూ..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జాన్ నిన్ను ప్రతీ క్షణం మిస్ అవుతున్నా .. శ్రీదేవిపై బోనీ కపూర్ ఎమోషనల్
స్వర్గీయ శ్రీదేవీ, అతిలోక సుందరి జయంతి నేడు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులంతా శ్రీదేవీని స్మరించుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సెలెబ్రిటీలంతా శ్రీదేవిని తలుచుకుంటున్నారు. ఎక్కడో తమిళనాడులో పుట్టి ఇండియన్ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవీ బోనీకపూర్ను పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవీ మరణం మాత్రం ఎందరిలోనో మనో వేదనను మిగిల్చింది. నేడు శ్రీదేవీ జయంతి కావడంతో అందరూ ఎమోషనల్ అవుతున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నిహారిక పెళ్లిని అలా ప్లాన్ చేసిన నాగబాబు.. ముందుగా ఆ ప్రముఖుల సమక్షంలో అలా!
పేరుకు మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయే అయినా... స్వతహాగా ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ... అద్భుతమైన మల్టీ టాలెంట్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే యాంకర్గా, నటిగా, నిర్మాతగా తనలోని ఎన్నో పాత్రలు బయట పెట్టింది. దీంతో మరిన్ని అవకాశాలతో ముందుకెళ్తోంది. ఇలాంటి తరుణంలో నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. ఆమె వివాహాన్ని నాగబాబు ఎలా చేయనున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!
పూర్తి
వివరాల
కోసం
ఇక్కడ
క్లిక్
చేయండి
వేశ్య వాళ్ల కోసం బట్టలిప్పితే.. ఈయన మాత్రం.. అర్నబ్పై వర్మ దారుణంగా కామెంట్స్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నేషనల్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అర్నబ్: ద న్యూస్ ప్రాస్టిట్యూట్ అని ఒక సినిమాను కూడా ఎనౌన్స్ చేసిన వర్మ అందుకే సంబంధించిన పోస్టర్లతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. టైటిల్ ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగా ఆయన ఇటీవల రిలీజ్ చేసిన మరో మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి
వివరాల
కోసం
ఇక్కడ
క్లిక్
చేయండి
సుశాంత్ను స్టన్ గన్తో చంపేశారు.. రియాను అరెస్ట్ చేయాలి.. ఎన్ఐఏ దర్యాప్తుకు డిమాండ్!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి రెండు నెలలుగా గడుస్తున్నప్పటికీ ఆయన మరణం వెనుక అసలు వాస్తవం బయటకు రాలేకపోయింది. అయితే సుశాంత్ మరణం వెనుక ఎన్నో అనుమానాలు, రకరకాల వదంతులు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి అనేక సందేహాల మధ్య సోషల్ మీడియాలో నెటిజన్లు కొత్తరకమైన వాదనను ముందుకు తెచ్చారు. నెటిజన్ల కామెంట్లపై బీజేపీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఏమిటంటే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Recommended Video
నీవో వీధి కుక్కవు.. పబ్లిసిటీ కోసం మొరగొద్దు.. మీరా మిథున్పై విజయ్, మహేష్ ఫ్యాన్స్ ఫైర్
తమిళ చిత్ర పరిశ్రమలో మోడల్గా, వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన మీరా మిథున్ ఇటీవల కాలంలో సినీ ప్రముఖులను టార్గెట్ చేయడం వివాదాస్పదంగా మారుతున్నది. ఇటీవల విజయ్ లాంటి హీరోలను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన విజయ్పై మీరా మిథున్ దారుణంగా కామెంట్లు చేసింది. ఈ వివాదంపై తనను లాగడంపై కమెడియన్ వివేక్ ఘాటుగా స్పందించారు. ఇంతకు మీరా మిథున్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే..