ట్రెండింగ్: యాంకర్ రష్మి పరువు తీశాడు, నాగార్జున కాలర్ పట్టుకున్న జేడీ, హీరోయిన్పై గుండాల దాడి!
మ్యాగజైన్ల కోసం హాట్ పోజులిచ్చే నువ్వు కూడా నీతులు చెప్పేదానివేనా..? అంటూ వీనా మాలిక్ మీద సానియా మీర్జా ఫైర్ అయ్యారు.. మెగా ఫ్యామిలీ హీరో మూవీలో ఆఫర్ లేదు, తప్పించలేదు ఎందుకు అలా రాస్తారో అర్థం కాదంటున్న పృథ్వీ.. అసెంబ్లీలో త్రివిక్రమ్ మూవీ 'అరవింద సమేత' డైలాగ్ పేల్చిన రోజా.. ఆమె ఎవరో కాదు మా కొలీగ్ కూతురు అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.. సింగర్ గీతా మాధురి ప్రెగ్నెంట్, శ్రీమంతం ఫోటోస్ వైరల్.. చైతూతో పెళ్లి తర్వాత ఎవరూ నా ముఖం చూడట్లేదు నా పరిస్థితి దారుణం అంటూ సమంత ఆవేదన.. సెట్లో హీరోయిన్పై గూండాల దాడి... ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. మీరు ఏమైనా మిస్సాయి ఉంటే ఓ లుక్కేయండి.

మ్యాగజైన్ల కోసం హాట్ పోజులిచ్చే నువ్వు కూడా నీతులు చెప్పేదానివేనా..? సానియా మీర్జా ఫైర్
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ని వివాహం చేసుకొని హాయిగా కాపురం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం అయిన కొత్తలో సానియాపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే క్రమంగా అవి తగ్గిపోయినప్పటికీ ఈ ఇద్దరిపై ఎప్పటికీ ఓ కన్నేసి ఉంచుతారు ఇరు దేశాల ప్రజలు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ విషయమై మరోసారి విమర్శల పాలయ్యారు ఈ క్రీడా దంపతులు.

ఆఫర్ లేదు.. తప్పించలేదు.. ఎందుకు అలా రాస్తారో.. పవన్ కల్యాణ్ ఎఫెక్ట్పై పృథ్వీ
టాలీవుడ్లో విలక్షణమైన పాత్రలతో తనదైన హాస్యాన్ని పండిస్తూ ఆకట్టుకొంటున్న స్టార్ కమెడియన్ పృథ్వీ. ఆయనను ముద్దుగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పిలుచుకొంటారు. గత కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాలకు విరామం చెప్పి సినిమాలపై దృష్టిపెట్టారు పృథ్వీ. అయితే తాజాగా పృథ్వీ గురించి ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఆ వార్త ఏమిటంటే..

అసెంబ్లీలో... త్రివిక్రమ్ మూవీ ‘అరవింద సమేత’ డైలాగ్ పేల్చిన రోజా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటి, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలోని డైలాగ్ జగన్కు ఆపాదించి చెప్పడం హైలెట్ అయింది.

ఆమె ఎవరో కాదు.. మా కొలీగ్ కూతురు... హాస్యనటి మేనకోడలు.. చిరంజీవి ఎమోషనల్
ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి' ది క్రికెటర్ అనేది టాగ్లైన్. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం టీజర్ను జూన్ 18న మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

సింగర్ గీతా మాధురి ప్రెగ్నెంట్, శ్రీమంతం ఫోటోస్ వైరల్!
తెలుగులో సింగర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురి... గతేడాది 'బిగ్ బాస్ తెలుగు 2' రియాల్టీ షోలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం గీతా మాధురికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నగ్నంగా అమలా పాల్... మరీ ఇంత బోల్డుగానా?
అమలా పాల్ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందుతున్న చిత్రం 'ఆడై'... రత్న కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తెలుగులో 'ఆమె' పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో అమలా పాల్ పూర్తి నగ్నంగా కనిపించడం సంచలనం రేపుతోంది.

అక్కినేని నాగచైతన్య పై పడిన శ్రీ రెడ్డి.. డోస్ మార్చి సెన్సేషనల్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీ పెద్దలే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ గతంలో నానా హంగామా చేసిన శ్రీ రెడ్డి మరోసారి విజృంభిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తనకు ఏదనిపిస్తే అది ఓపెన్ గా చెప్పేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి అక్కడే సెటిలైన శ్రీ రెడ్డి.. ఈ మధ్యకాలంలో మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. తెలుగు, తమిళ సినీ ప్రముఖులను వదిలి పెట్టని శ్రీ రెడ్డి తాజాగా అక్కినేని నాగచైతన్య పై డిఫరెంట్ యాంగిల్లో కామెంట్ చేసింది. వివరాల్లోకి పోతే..

చైతూతో పెళ్లి తర్వాత ఎవరూ నా ముఖం చూడట్లేదు... నా పరిస్థితి దారుణం.. సమంత ఆవేదన
అక్కినేని వారసుడు నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంతను వరుస హిట్లు పలకరించాయి. గతేడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొన్నారు. అలాగే ఈ ఏడాది ఆరంభంలోనే సూపర్ డీలక్స్తో మంచి విజయాన్ని, విమర్శకులు ప్రశంసలను అందుకొన్నది. అయితే పెళ్లి తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ తన ప్రతిభకు సానపెడుతున్నది ఈ బ్యూటీ. అయితే వివాహం తర్వాత నాకు ఆఫర్లు తగ్గాయని సమంత ఇటీవల ఇంటర్వూలో చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సమంత ఏమన్నారంటే..

బూతులు మాట్లాడి నెగిటివిటీ పెంచొద్దు: పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడి కౌంటర్
'నా ఆలోచన' పేరుతో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసిన కామెంట్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అయితే కొందరు తనను దారుణంగా ట్రోల్ చేయడంతో తమ్మారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

యాంకర్ రష్మిని టార్గెట్ చేసిన చమ్మక్ చంద్ర.. పరువు తీశాడు!
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులరిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మి పెళ్లి అంశం ఎప్పుడూ హాట్ టాపిక్కే. సుడిగాలి సుధీర్తో రష్మి ప్రేమాయణం సాగిస్తోందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇదంతా జబర్దస్త్ స్కిట్లలో ప్రేక్షకులను నవ్వించడానికి క్రియేట్ చేసిన ఒక హైడ్రామా.

హోటల్లో అమ్మాయితో బూమ్రా.. ఫొటోలో ఉంది అనుపమ పరమేశ్వరన్ అంటూ?
ప్రత్యర్థి జట్టు ఏదైనా గానీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే భారతీయ బౌలర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది జస్ప్రిత్ బూమ్రా. మైదానం, ఆట తప్ప మరోటి ఎరుగని ఈ యువ క్రికెటర్ ఈ మధ్య కాలంలో మీడియాలో రకరకాలుగా నానుతున్నాడు. సినీతార అనుపమ పరమేశ్వరన్తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తల మధ్య ఆసక్తికరమైన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకు ఆ ఫోటోలో ఉన్నది ఎవరనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ ఫోటో గురించి మీకోసం..

‘‘నాగార్జున కొడితే కాలర్ పట్టుకున్నా.. అన్నపూర్ణ స్టూడియో డ్రైవర్లు నా తలబద్దలు కొట్టబోయారు’’
అలీ హోస్ట్ చేస్తున్న 'అలీతో సరదాగా' అనే షోకు హాజరైన జేడీ చక్రవర్తి తన తొలి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన గురించి వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోలో హీరో నాగార్జునతో గొడవ పడ్డట్లు వెల్లడించారు.

సెట్లో హీరోయిన్పై గూండాల దాడి... షూటింగ్లో గొడ్డును బాదినట్టు.. పోలీసుల అండతో
పద్మావత్ సినిమా షూటింగ్లో దాడి ఘటన తర్వాత మరోసారి బాలీవుడ్ హీరోయిన్ మహీ గిల్పై సెట్లో అగంతకులు దాడి చేశారు. ఫిక్సర్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ సందర్బంగా జరిగిన ఘటనలో సినిమాటోగ్రాఫర్, దర్శకుడికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు గుండాలతోపాటు పోలీసులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని నిర్మాత సాకేత్ సావ్నీ వెల్లడించారు. నిర్మాత మాట్లాడిన వీడియోను ఏక్తాకపూర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. ఈ దాడి ఘటనలోకి వెళితే..

బయటపడిన బాలయ్య, జగన్ అసలు వ్యవహారం.. ఇదీ సంగతి!
నందమూరి నటసింహం బాలకృష్ణకు అంతులేని అభిమాన వర్గం ఉంది. సినీ, రాజకీయ వర్గాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య బాబు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ బాలయ్య మాత్రం విజయకేతనం ఎగరేశాడు. అయితే వైసీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు వీరాభిమాని అని, దానికి ప్రూఫ్ ఇదే అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

ప్రెగ్నెంట్ హీరోయిన్ స్పెషల్ ట్రీట్.. గౌన్ని పైకి ఎత్తి పట్టుకొని చిలిపిగా!
తెలుగు తెరకు గ్లామర్ డోస్ రుచి చూపించిన హీరోయిన్లలో సమీరా రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. గత పదిహేనేళ్ల క్రిందట ఎన్టీఆర్తో కలిసి 'నరసింహుడు, అశోక్' అదేవిధంగా చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' చిత్రాలలో నటించిన ఈ భామ.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమైంది. చాలా కాలంగా టచ్లో లేనప్పటీకీ ఈ మధ్యన మాత్రం సోషల్ మీడియా ద్వారా బాగా దగ్గరవుతోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఈ టైమ్లో కూడా దడ పుట్టించే హాట్ ఫోజులిస్తూ నెట్టింట హాట్ టాపిక్గా మారుతోంది.


Click it and Unblock the Notifications











