Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ట్రెండింగ్: ఇక జూ ఎన్టీఆరే దిక్కు, దర్శకుడి మోసం, రామ్ చరణ్ సంచలన పోస్ట్!
బాలీవుడ్లో మరో బ్రేకప్ సంఘటన చోటు చేసుకుంది. అమీర్ ఖాన్ బాటలోనే ఆయన మేనల్లుడు విడాకులు తీసుకుంటున్నాడు. న్యూడ్ ఫొటోలు పంపమన్న నెటిజన్కు చిన్మయి షాక్ ఇచ్చింది. అందుకే నా పీరియడ్స్ ఆగిపోయాయి అంటూ ఆసక్తికర కారణం చెప్పిన హాలీవుడ్ బ్యూటీ, ఫోటో కాదు ఏకంగా సెక్సీ వీడియోనే షేర్ చేసి సంచలనం సృష్టించిన శ్రీయ, అనుష్కతో ఆ సీన్ ఉందంటేనే ఒప్పుకున్నాను కానీ దర్శకుడు మోసం చేశాడంటున్న సుమన్, 68 ఏళ్ల నటుడితో 26 ఏళ్ల ప్రముఖ నటి పెళ్లిసూసైడ్ చేసుకొంటామని ఫ్యాన్స్ వార్నింగ్, 2019 ఎన్నికల్లో సినీస్టార్ల గెలుపోటములు లాంి అంశాలు ఈవారం ట్రెండింగులో ఉన్నాయి..
బాలీవుడ్లో మరో బ్రేకప్... విడిపోయిన స్టార్ హీరో దంపతులు.. అమీర్ఖాన్ దారిలోనే మేనల్లుడు!
బాలీవుడ్లో మరో స్టార్ జంట విడిపోవడానికి సిద్ధపడుతున్నది. మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు, హీరో ఇమ్రాన్ ఖాన్, అవంతి మాలిక్ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడం బాలీవుడ్ వర్గాలను షాక్ గురి చేసింది. చక్కగా సాగుతుందనుకొన్న కాపురం పెటాకులు కావడంపై రకరకాల వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. వీరిద్దరి విడిపోవాలని నిర్ణయం తీసుకోవడంతో వీరి ఐదేళ్ల కూతురు పరిస్థితి గందరగోళంలో పడింది. ఇమ్రాన్ ఖాన్ విడాకులు తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
న్యూడ్ ఫొటోలు పంపమన్న నెటిజన్కు చిన్మయి షాక్.. ఆమె ఏం పంపారో తెలిస్తే..
సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో అత్యంత ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మహిళలనే కనీస మర్యాద లేకుండా నెటిజన్లు నోటికి వచ్చినట్టు మాటలు వదలేస్తుంటారు. కొందరు బాధతో వాటిపై స్పందించరు. కొందరు వారికి సరైన బుద్ది చెప్పే విధంగా సమాధానం ఇచ్చి నోరుమూయించేస్తారు. తాజాగా అలాంటి ఇంటర్నెట్ వేధింపులకు గురైన గాయని చిన్మయి.. ఓ వ్యక్తికి దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అందుకే నా పీరియడ్స్ ఆగిపోయాయి.. షాకింగ్ కారణం చెప్పిన హాట్ బ్యూటీ!
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సిరీస్ చూసే వారికి సోఫీ టర్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె గురించి మరింత వివరంగా చెప్పాలంటే... మన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తోటికోడలు. అమెరికన్ సింగర్ నిక్ జోనస్ను ప్రియాంక పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిక్ సోదరుడు జో జోనస్తో సోఫీ టర్నర్ వివాహం కొన్ని రోజుల క్రితం జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఫోటో కాదు ఏకంగా సెక్సీ వీడియోనే షేర్ చేసి సంచలనం సృష్టించిన శ్రీయ
సీనియర్ భామ శ్రీయ శరణ్ తన హాట్ డాన్స్తో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. హాట్ హాట్ ఫోజులిస్తూ ఆమె చేసిన డాన్స్ వీడియోను స్వయంగా తానే సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించింది శ్రీయ. దశాబ్దానికి పైగా సినీ కెరీర్ కొనసాగిస్తూ అందరు సీనియర్ హీరోల సరసన నటించింది శ్రీయ. అయితే ఈ మధ్యకాలంలో కాస్త సినిమా జోరు తగ్గించిన ఆమె సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది. ఈ మేరకు తాజాగా కిక్కిచ్చే ఓ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
‘‘అనుష్కతో ఆ సీన్ ఉందంటేనే ఒప్పుకున్నా... దర్శకుడు మోసం చేశాడు''
అనుష్క టైటిల్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రుద్రమదేవి'లో ప్రముఖ నటుడు సుమన్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సుమన్ తెలుగులో విలన్ పాత్ర చేయడం అదే తొలిసారి. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన పేమెంట్ విషయంలో గుణశేఖర్ మీద సుమన్ చెక్ బౌన్స్ కేసు వేయడం చర్చనీయాంశం అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమన్ 'రుద్రమదేవి' వివాదం గురించి స్పందించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సినిమా, టీవీ వాళ్లను మించిపోయిన టిక్ టాక్ సెలబ్రిటీ దారుణ హత్య!
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉంటడటం అంటే ఆశామాషీ కాదు. ఈ విషయంలో సినిమా, టీవీ, స్పోర్ట్స్ రంగానికి చెందిన సెలబ్రిటీలే టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. అయితే టిక్ టాక్ లాంటి యాప్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా తీరే పూర్తిగా మారిపోయింది. తమ టాలెంట్ ప్రదర్శిస్తూ సాధారణ వ్యక్తులు కూడా సెలబ్రిటీలుగా అవతరిస్తున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
68 ఏళ్ల నటుడితో 26 ఏళ్ల ప్రముఖ నటి పెళ్లి.. సూసైడ్ చేసుకొంటామని ఫ్యాన్స్ వార్నింగ్
హాలీవుడ్ నటి, గాయని, నిర్మాత, పాటల రచయిత సెలెనా గోమెజ్ సినీ ప్రపంచానికి, అభిమానులకు గట్టి సాక్ ఇచ్చింది. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ప్రియుడిని వివాహం చేసుకోబోతున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కాకపోతే ప్రియుడు తన తాత వయసు ఉన్నవాడు కావడం ఈ ప్రేమలో ట్విస్ట్గా మారింది. 68 ఏళ్ల ప్రియుడితో వివాహానికి సిద్ధం కావడం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. వివరాల్లోకి వెళితే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నటి రోజాపై ‘ఐరన్ లెగ్' మచ్చ తొలగిపోయినట్లేనా?
తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు నటిగా తన హవా కొసాగించిన రోజా... టాలీవుడ్లో దాదాపు అందరు అగ్రహీరోలతో నటించారు. సినిమాల్లో సక్సెస్ఫుల్ తారగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థతి అలా లేదు. 'ఐరన్ లెగ్' అనే అపవాదు మూటగట్టుకున్నారు. అందుకు కారణం 2009(టీడీపీ), 2014(వైసీపీ) ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీలు ఓటమి పాలవ్వడమే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మొగుడు కొట్టినందుకు కాదు.. కోడలు నవ్వినందుకు.. చంద్రబాబుపై థర్టీ ఇయర్స్ పృథ్వీ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో సినీ నటుడు. ఆ పార్టీ నేత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా పృథ్వీరాజ్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో మీడియాతో పృథ్వీరాజ్ మాట్లాడుతూ చంద్రబాబుపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు. చంద్రబాబును ఉద్దేశించి పృథ్వీ ఏమన్నారంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కాపాడేది అతడేనా? అందరి దృష్టి జూ ఎన్టీఆర్ వైపే.. బ్రహ్మజీ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అధికార తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. 175 సీట్లు ఉన్న అసెంబ్లీలో కనీసం పావువంతు సీట్లు కూడా సాధించలేక పోయింది. ప్రజల్లో ఈ పార్టీ నమ్మకం పూర్తిగా కోల్పోయింది అనడానికి తాజా ఫలితాలే నిదర్శనం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చంద్రబాబుకు ఉప్పుకారం పెట్టా.. ఉసురు తాకింది, వెధవల్లారా నేను గోల్డెన్ లెగ్.. సినీ నటి రోజా ఫైర్
సినీ రంగంలోనే కాదు.. రాజకీయాల్లోనూ సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత రోజా సత్తా చాటారు. వరుసగా రెండోసారి విజయం సాధించి తనపై ఉన్న అపవాదును తొలగించుకొన్నారు. నగరి నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన పాపాల వల్లే వారికి ఈ పరాజయం ఎదురైందని అన్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ.. బై బై బాబు అని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2019 ఎన్నికల్లో సినీ స్టార్లు... ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి 350కి పైగా స్థానాల్లో గెలుపొంది మరోసారి విజయ ఢంకా మ్రోగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ క్లీన్ స్వీప్ చేసి అధికారం చేజిక్కించుకుంది. సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు స్టార్లు బరిలో నిలిచారు. వీరిలో కొందరు ప్రజల మద్దతుతో విజయం వైపు అడుగులు వేయగా... మరికొందరు ఘోర పరాజయం పాలయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
జగన్కు మళ్లీ ఓటెయ్యాలని అడగను: మీడియా ముందుకు వచ్చిన పోసాని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపుకోసం ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తనవంతు కృషి చేశారు. ఆయన కృషి ఫలించి గురువారం విడుదలైన ఫలితాల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో పోసాని మీడియా ముందుకు వచ్చారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నాగబాబు ఓటమి... ‘మా'జీ ప్రెసిడెంట్ శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్టేనా?
జనసేన పార్టీ నుంచి నరసాపూర్ ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నాగబాబు ఓటమి ఎవరికి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో తెలియదు కానీ... ఒక వ్యక్తి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పక తప్పదు. అతడే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. 'మా' ఎన్నికల్లో తనను ఓటించడానికి నాగబాబు రాత్రికి రాత్రే చేసిన ప్రయత్నాలతో తీవ్ర మనస్తాపికి గురైన శివాజీ రాజా.... తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లే భీమవరం వెళ్లి నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. శివాజీ రాజా చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
జనసేన, పవన్ కళ్యాణ్ ఓటమిని ఉద్దేశిస్తూ... రామ్ చరణ్ సంచలన పోస్ట్!
2019 ఏపీ ఎన్నికల్లో 'జనసేన' పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసిన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడం పార్టీ శ్రేణులను, అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మొత్తం 175 స్థానాలకు గాను కేవలం రాజోలులో రాపాక వరప్రసాద్ మాత్రమే ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. ఓటమితో కృంగుబాటులో ఉన్న జనసేన కార్యకర్తలు, మెగా అభిమానుల్లో ధైర్యం నింపుతూ రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. మన లక్ష్యం అధికారం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. చరణ్ చేసిన ఈ ట్వీట్ జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.