Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కలర్స్ స్వాతి మూవీ ‘త్రిపుర’ ఫస్ట్ లుక్
హైదరాబాద్: కలర్స్ స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ చిత్రానికి 'తిరుపుర సుందరి' అనే టైటిల్ ని ఖరారు చేశారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇటీవలే రెండో షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ - "ఈ చిత్రకథ గురించి నాకు వెలిగొండ శ్రీనివాస్ చెప్పాడు. చాలా బాగుంది. సినిమా కూడా బాగా వస్తోందని విన్నాను. 'గీతాంజలి'కన్నా ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
చిత్ర నిర్మాతలు చినబాబు, రాజశేఖర్ లు మాట్లాడుతూ - ''అనుకున్న విధంగానే షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం జరుపుతున్న రెండో షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన 'గీతాంజలి'కి మించిన ఉత్కంట భరితంగా ఈ చిత్రం ఉంటుంది. స్వాతి మంచి నటి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను అద్భుతంగా చేస్తోంది. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను ఎడిటింగ్ చేసి రష్ చూసాము. చాలా అధ్బుతంగా వచ్చింది. '' అన్నారు.
దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ- "కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ సమకూర్చిన స్ర్కీన్ ప్లే ప్రధాన బలంగా నిలుస్తుంది. కమ్రాన్ అద్భుతమైన పాటలు స్వరపరిచారు. ఇందులో ఉన్న నాలుగు పాటలకు చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందిస్తున్నారు" అని చెప్పారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్, కథ-దర్సకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.