రాణాకు తనకు మధ్య ఆ వార్తపై త్రిష మనస్తాపం
తెలుగు యువహీరో రాణా దగ్గుబాటితో కలిసి సెక్సీ హీరోయిన్ త్రిష గోవాలో ఎంజాయ్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. న్యూఇయర్ పార్టీలో త్రిష రాణాతో కలిసే ఉందని, అదే రాత్రి ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను త్రిష ఖండించింది. రాణా, ఇతర స్నేహితులతో కలిసి తాను ఆ రోజు న్యూఇయర్ వేడుకలో ఉన్న విషయం వాస్తవమే, రాణా నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు, ఆరోజు అంతా కలిసి వేడుక జరుపుకున్నామే కానీ....తనకు, రాణాకు ఎఫైర్ అంటగడుతూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేని స్పష్టం చేసింది 28 ఏళ్ల ఈ వయ్యారి.
త్రిష ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సరసన 'దమ్ము' చిత్రంలో నటిస్తోంది. మరో వైపు ఆమె వెంకటేష్ తో కలిసి నటించిన బాడీగార్డ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక రాణా ప్రస్తుతం జెనీలియాతో కలిసి 'నాఇష్టం', క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రాల్లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











