రాణాతో ఎంగేజ్ మెంట్ కాలేదు: త్రిష
హైదరాబాద్: దగ్గుబాటి హీరో రాణా, త్రిష మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. త్రిషకు రాణా ఓ ప్లాటినం ఉంగరాన్ని, నగల సెట్ను బహూకరించాడనే వార్త కూడా ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలను త్రిష ఖండించింది.
ఈ ప్రచారం అబద్ధమని, రాణాతో తనకు నిశ్చితార్థం కాలేదని త్రిష మండిపడింది. ఆ ఫొటోలూ వార్తలూ అవాస్తవమని.. తాను, రాణా ఎప్పటినుంచో మంచి స్నేహితులమని.. అలాంటి ది తమ మధ్య ఏదో జరుగుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఆమె తెలిపింది. అసలు జరగని ఎంగేజ్మెంట్ గురించి లేనిపోని వదంతులు సృష్టించొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మూడు తమిళ సినిమాల్లో నటిస్తున్న తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది.
త్రిష సినిమాల విషయానికొస్తే... ఆమె తెలుగులో చివరగా నటించిన 'దమ్ము' చిత్రం అనుకున్న అంచనాలను చేరుకోక పోవడంతో అమ్మడు మళ్లీ కాస్త వెనకబడిపోయింది. ప్రస్తుతం ఆమె మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. విశాల్ సరసన 'సమర్' చిత్రంతో పాటు... జయం రవి సరసన 'భూలోగం' చిత్రంలో, హీరో జీవాతో కలిసి 'ఎండ్రెండ్రుమ్ పున్నాగయ్' చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











