Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలకృష్ణను మాత్రం వదులుకోను: త్రిష
బాలకృష్ణతో కలిసి నటించాలని నాకూ ఉంది. ఆ అవకాశం వస్తే మాత్రం వదులుకోను. ప్రస్తుతానికైతే... వెంకటేష్గారితో బాడీగార్డ్ చేస్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ వెరైటీగా ఉంటుంది అంటోంది త్రిష. బెల్లంకొండ సురేష్, బి గోపాల్ కాంబినేషన్ లో బాలకృష్ణ హీరోగా నటించే చిత్రంలో ఆమెను తీసుకుంటున్నారు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమెను మీడియా వారు..బాలకృష్ణతో కలిసి నటిస్తున్న మాట నిజమేనా? అని ప్రశ్నిస్తే ఇలా సమాధానమిచ్చింది. అలాగే ఇప్పుడు మిగతా హీరోయిన్స్ ప్రియమణి,జెనీలియా,అనూష్క వంటి వారు తెరపై కత్తి పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తే సమాధానంగా... కత్తి పట్టి వీరనారిలా తెరపై ఓ రేంజ్లో ఇరగదీసేయాలని నాకూ ఉంది. కానీ అలాంటి కథలతో ఎవరూ నా దగ్గరకు రావడం లేదు. బహుశా అలాంటి యాంగ్రీ లుక్ మన దర్శక, నిర్మాతలకు నాలో కనిపించలేదేమో అంటూ నవ్వేసింది.
అలాగే నాకు స్వతహాగా లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఇష్టం ఉండదు.ఇది గ్లామర్ ప్రపంచం. దానికి తగ్గట్టుగానే మనం పాత్రలను ఎంచుకోవాలి. ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారిపోయింది. అరుంధతి* లాంటి సినిమా హిట్ అయ్యిందంటే... దానికి చాలా కారణాలున్నాయి. కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే కాదు. నా వరకూ గ్లామర్గా కనిపించడానికి ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది త్రిష. టూ పీస్ బికినీపై అభిప్రాయం అనడిగితే అది ఎంత హాట్ ట్రెండ్ అయినా... ప్రస్తుతానికైతే నేను అలాంటి సాహసం చేయలేను. భవిష్యత్తులో చేస్తానేమో ఇప్పుడే చెప్పలేను అని తేల్చేసింది.ఇక తెలుగులో త్రిష ప్రస్తుతం వెంకటేష్ సరసన బాడీగార్డు రీమేక్ లో చేస్తోంది. డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలగు చిత్రం. వీటితో పాటు ఆమె విశాల్ సినిమాను కూడా ఓకే చేసింది.ఇక త్రిష హఠాత్తుగా విశాల్ ప్రాజెక్టుని ఎందుకు ఓకే చేసింది అంటే..దర్శకుడు తిరు చెప్పిన కథ నచ్చింది అంటోంది.ఆ కథ విని ధ్రిల్లయ్యానని అంటోంది.