twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ నైట్ లో త్రిష, నయనతార మిస్..ఎందుకంటే

    By Srikanya
    |

    స్టార్ నైట్ పోగ్రామ్ లో నయనతార, త్రిష కనిపించకపోవటం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పటికీ డేట్స్ సమస్యలు రాకూడదని ఆ మూడు రోజులూ షూటింగ్ లు కూడా రద్దు చేసారు. అయినా వీరు రాలేదు.దాంతో వరస ఆఫర్స్ తో తెలుగులో చెలరేగుతున్న వీరు కూడా తమ వంతు భాద్యతగా ఈ పోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఉంటే పద్దతిగా ఉండేదని అందరూ భావిస్తున్నారు. అయితే వీరు రాకపోవటానికి కారణం బాలీవుడ్ ఆఫర్స్ అని సమాచారం. త్రిష హీరోయిన్ గా హిందీ తెరకు పరిచయమవుతున్న కట్టా మీటా చిత్రం షూటింగ్ లో ఆమె తప్పని సరిగా ఉండాల్సి వచ్చిందిట. ఆ డేట్స్ తర్వాత ఎడ్జెస్ట్ చేయలేని కాంబినేషన్ సీన్స్ ట. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రియదర్శన్ డైరక్ట్ చేస్తున్నాడు.

    ఇక నయనతార విషయానికి వస్తే ఆమె ప్రభుదేవా డైరక్ట్ చేయనున్న వాంటెడ్ సీక్వెల్ మోస్ట్ వాంటెడ్ లో హీరోయిన్ గా బుక్ అవటం కోసం అక్కడ చక్కర్లు కొట్టాల్సిన పరిస్ధితిట. దాంతో ఇద్దరూ హ్యాడ్ ఇచ్చారు.ఇది ప్రక్కన పెడితే ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి స్టార్ నైట్ పోగ్రామ్ లో అనుష్క, ఇలియానా, శ్రియ, జెనీలియా, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, హన్సిక, మమతామోహన్‌దాస్‌, ప్రియమణి, భూమిక, విమలారామన్‌... వంటి నేటి క్రేజీ హీరోయిన్లతోపాటు నిన్నటితరం నాయికలు - జయప్రద, జయసుధ, సుహాసిని, రోజా, రమ్యకృష్ణలు కూడా స్టార్‌నైట్‌లో పాల్గొని అందరి మన్ననలు పొందారు.

    ప్రస్తుతం నయనతార ఎన్టీఆర్‌ సరసన అదుర్స్ చిత్రలో చేస్తోంది. వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. షీలా మరో హీరోయిన్ గా చేస్తోంది. త్రిష కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్న నమో వెంకటేశ చిత్రంలో చేస్తోంది. వెంకటేష్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల డైరక్ట్ చేస్తున్నారు. ఏదైమైనా వరద భాదితుల కోసం ఏర్పాటు చేసిన స్టార్ నైట్ కు రాకపోవటం భాద్యతా రాహిత్యమేనని చాలా మంది విమర్శిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X