twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1.16 కోట్ల జరిమానా నుంచి తప్పించుకున్న త్రిష!

    |

    స్టార్ హీరోయిన్ త్రిషకు మద్రాసు హై కోర్టు నుంచి ఊరట లభించింది. ఆదాయపు పన్ను చెల్లింపు విషయంలో త్రిషపై ఐటి అధికారులు కేసు నమోదు చేసారు. 2010-11 సంవత్సరంలో ఆమె తన ఆదాయపు పన్ను లెక్కలేని రహస్యంగా ఉంచిందని ఈ కేసు నమోదైంది. దక్షిణాదిలో చాలా కాలం పాటు వరుస సినిమాలతో త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

    ఆ సమయంలో త్రిష అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు కేసు నమోదు చేయడంతో త్రిష హై కోర్టుని ఆశ్రయించింది. ఆమె ఉద్దేశపూర్వకంగా ఆదాయవివరాలు దాచిపెట్టిందని, 1.16 కోట్ల జరిమానా విధించాలని ఐటి అధికారులు కోర్టుని కోరారు.

     Trisha not liable to pay Rs 1.16 crore penalty

    జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. త్రిష ఉద్దేశపూర్వకంగా ఆదాయ వివరాలు దాచిపెట్టలేదని, అందువలన ఆమె జరిమానా చెల్లించనవసరం లేదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో త్రిషకు ఊరట లభించింది.

    English summary
    Trisha not liable to pay Rs 1.16 crore penalty. Trisha gets relief from IT
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X