Don't Miss!
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- News కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
1.16 కోట్ల జరిమానా నుంచి తప్పించుకున్న త్రిష!
స్టార్ హీరోయిన్ త్రిషకు మద్రాసు హై కోర్టు నుంచి ఊరట లభించింది. ఆదాయపు పన్ను చెల్లింపు విషయంలో త్రిషపై ఐటి అధికారులు కేసు నమోదు చేసారు. 2010-11 సంవత్సరంలో ఆమె తన ఆదాయపు పన్ను లెక్కలేని రహస్యంగా ఉంచిందని ఈ కేసు నమోదైంది. దక్షిణాదిలో చాలా కాలం పాటు వరుస సినిమాలతో త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
ఆ సమయంలో త్రిష అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు కేసు నమోదు చేయడంతో త్రిష హై కోర్టుని ఆశ్రయించింది. ఆమె ఉద్దేశపూర్వకంగా ఆదాయవివరాలు దాచిపెట్టిందని, 1.16 కోట్ల జరిమానా విధించాలని ఐటి అధికారులు కోర్టుని కోరారు.
జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. త్రిష ఉద్దేశపూర్వకంగా ఆదాయ వివరాలు దాచిపెట్టలేదని, అందువలన ఆమె జరిమానా చెల్లించనవసరం లేదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో త్రిషకు ఊరట లభించింది.