Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఅర్ తో త్రిష తప్పుకుంది..కాజల్ చేరింది
జూ ఎన్టీఅర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న బృందావనం చిత్రంలో హీరోయిన్ గా త్రిషను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు త్రిష తప్పుకుని ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. తాను బాలీవుడ్ చిత్రం కట్టా మీటా లో బిజీగా ఉండి డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని త్రిష చెప్పటంతో ఈ మార్పు తప్పలేదని అంటున్నారు.ఇక మగధీర విజయంతో ఉన్న కాజల్ కి వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. వాటిల్లో పెద్ద హీరోలవే ఓకే చేసి మిగతావి పెండింగ్ లో పెడుతోంది కాజల్. అలాగే ఈ చిత్రాన్ని పైడపల్లి వంశీ డైరక్ట్ చేస్తున్నాడు. ఆయన గతంలో ప్రభాస్ తో మున్నా చిత్రాన్ని రూపొందించారు. భాక్సా ఫీస్ వద్ద పరాజయాన్ని చూసినా ఆ చిత్రంలో టెక్నికల్ గా దర్శకుడు మంచి ప్రతిభ చూపాడని పేరు వచ్చింది. దాంతో జూ ఎన్టీఅర్ పిలిచి కథ విని డేట్స్ ఇచ్చారు. అలాగే మున్నా వర్కవుట్ కాకపోయినా మరోసారి దిల్ రాజు..వంశీకి అవకాశం ఇచ్చారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రానికి గోవిందుడు అందరి వాడేలే అనే టైటిల్ పెట్టారు. టైటిల్ కు తగ్గట్లుగానే ఎంటర్టైనర్ గా కథనం నడుస్తుందని వినికిడి.