Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జూ ఎన్టీఅర్ తో త్రిష తప్పుకుంది..కాజల్ చేరింది
జూ ఎన్టీఅర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న బృందావనం చిత్రంలో హీరోయిన్ గా త్రిషను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు త్రిష తప్పుకుని ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. తాను బాలీవుడ్ చిత్రం కట్టా మీటా లో బిజీగా ఉండి డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని త్రిష చెప్పటంతో ఈ మార్పు తప్పలేదని అంటున్నారు.ఇక మగధీర విజయంతో ఉన్న కాజల్ కి వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. వాటిల్లో పెద్ద హీరోలవే ఓకే చేసి మిగతావి పెండింగ్ లో పెడుతోంది కాజల్. అలాగే ఈ చిత్రాన్ని పైడపల్లి వంశీ డైరక్ట్ చేస్తున్నాడు. ఆయన గతంలో ప్రభాస్ తో మున్నా చిత్రాన్ని రూపొందించారు. భాక్సా ఫీస్ వద్ద పరాజయాన్ని చూసినా ఆ చిత్రంలో టెక్నికల్ గా దర్శకుడు మంచి ప్రతిభ చూపాడని పేరు వచ్చింది. దాంతో జూ ఎన్టీఅర్ పిలిచి కథ విని డేట్స్ ఇచ్చారు. అలాగే మున్నా వర్కవుట్ కాకపోయినా మరోసారి దిల్ రాజు..వంశీకి అవకాశం ఇచ్చారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రానికి గోవిందుడు అందరి వాడేలే అనే టైటిల్ పెట్టారు. టైటిల్ కు తగ్గట్లుగానే ఎంటర్టైనర్ గా కథనం నడుస్తుందని వినికిడి.