Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
జూ ఎన్టీఅర్ తో త్రిష తప్పుకుంది..కాజల్ చేరింది
జూ ఎన్టీఅర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న బృందావనం చిత్రంలో హీరోయిన్ గా త్రిషను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు త్రిష తప్పుకుని ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. తాను బాలీవుడ్ చిత్రం కట్టా మీటా లో బిజీగా ఉండి డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని త్రిష చెప్పటంతో ఈ మార్పు తప్పలేదని అంటున్నారు.ఇక మగధీర విజయంతో ఉన్న కాజల్ కి వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. వాటిల్లో పెద్ద హీరోలవే ఓకే చేసి మిగతావి పెండింగ్ లో పెడుతోంది కాజల్. అలాగే ఈ చిత్రాన్ని పైడపల్లి వంశీ డైరక్ట్ చేస్తున్నాడు. ఆయన గతంలో ప్రభాస్ తో మున్నా చిత్రాన్ని రూపొందించారు. భాక్సా ఫీస్ వద్ద పరాజయాన్ని చూసినా ఆ చిత్రంలో టెక్నికల్ గా దర్శకుడు మంచి ప్రతిభ చూపాడని పేరు వచ్చింది. దాంతో జూ ఎన్టీఅర్ పిలిచి కథ విని డేట్స్ ఇచ్చారు. అలాగే మున్నా వర్కవుట్ కాకపోయినా మరోసారి దిల్ రాజు..వంశీకి అవకాశం ఇచ్చారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రానికి గోవిందుడు అందరి వాడేలే అనే టైటిల్ పెట్టారు. టైటిల్ కు తగ్గట్లుగానే ఎంటర్టైనర్ గా కథనం నడుస్తుందని వినికిడి.