twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ కి తెలియకుండా త్రిషను సెటప్ చేసేశారట..

    By Sindhu
    |

    తన ఫేవరెట్ టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ అని త్రిష చాలాసార్లు చెప్పింది అయితే తెలుగులో టాప్ హీరోలందరితో నటించిన త్రిషకి పవన్ కళ్యాణ్తో ఫుల్ టైమ్ హీరోయిన్ గా చేసే అవకాశం మాత్రం ఎన్నోసార్లు మిస్ అయింది. 'బంగారం"లో పవన్ కళ్యాణ్ సరసన ఒక్క సీన్ లో నటించిన త్రిషకి అతనితో పూర్తిస్థాయి సినిమా చేసే అవకాశం చాలా కాలానికి వచ్చింది.

    పవన్ కళ్యాణ్ 'లవ్ ఆజ్ కల్" రీమేక్ తర్వాత చేయబోయే చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. తెలుగులో త్వరలో ఒక టాప్ హీరో సినిమాలో నటిస్తున్నానని, ఆ అవకాశం రావడం పట్ల చాలా ఎక్సయిట్ అవుతున్నానని, ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని త్రిష ట్విట్టర్ లోనూ పోస్ట్ చేసింది. అసలు విషయం ఏటంటే పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి పర్హాన్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో ఇలియానా కథానాయికగా నటించనుందనే వార్తలు వినిపించాయి. ఇలియానా డేట్స్ కూడా కన్ఫార్మ్ చేసినట్టు వినికిడి. కానీ ఇలియానా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'త్రీ ఇడియట్స్" సినిమా రీమేక్ కు బల్క్ డేట్స్ ఇచ్చిందట.

    ఈ నేపధ్యంలో పవర్ స్టార్ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట. దాంతో పవర్ స్టార్ సరసన త్రిషను కథానాయికగా ఎంపిక చేయడానికి దర్శక, నిర్మాతలు సిద్దమయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జెరూసులేంలో ఉన్నాడు కాబట్టి, అక్కడ్నుంచి రాగానే పవర్ స్టార్ కు ఓ మాట చెప్పి త్రిషను కన్ఫర్మ్ చేయాలని ఈ యూనిట్ అనుకుంటోందట.

    అయితే పవన్ మాత్రం 'కొమరం పులి" సినిమాకి జరిగిన జాప్యం తన మలి చిత్రానికి జరగకుండా పవన్ కళ్యాణ్ పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. స్క్రిప్ట్ అంతా సిద్దమయ్యాకే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయాలని డిసైడయ్యాడు. మరో విశేషమేమిటంటే ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ ట్యూన్స్ ఇస్తున్నాడని ఇండస్ట్రీ రిపోర్ట్. గతంలో పవన్ తో 'ఖుషీ", 'గుడుంబా శంకర్", 'బాలు" చిత్రాలకి మణిశర్మ సూపర్ హిట్ సాంగ్స్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X