Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మూడు కండీషన్స్ తో హీరోయిన్ ను కలుసుకొనే ఛాన్స్...!?
తనను కలవడానికి వచ్చే అభిమానులకు త్రిష మూడు కండిషన్లు పెడుతుందట. సెల్ ఫోన్ లో తనని ఫోటో తియ్యకూడదన్నది మొదటి కండిషన్. రూపాయి నోట్ల మీద ఆటోగ్రాఫ్ అడగకూడదన్నది రెండో కండిషన్. ఖాళీ పేపర్ మీద సంతకం అడగకూడదన్నది మూడో కండిషన్.
సెల్ ఫోన్ లో ఫోటో తీసి, వేరే రకంగా ఉపయోగిస్తారేమోననే భయంతోనే త్రిష ఆ కండిషన్ పెట్టి ఉంటుంది. అలాగే రూపాయి నోటు విలువైనది కాబట్టి..అందులో సంతకం పెట్టనని చెప్పి ఉంటుంది. ఖాళీ పేపర్ లో సంతకం పెడితే మిస్ యూజక చేస్తారనే భయంతోనే త్రిష ఆ నిబంధన విధించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రీసెంట్ గా త్రిష- అజిత్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'మంకత్తా' చిత్రాన్ని గ్యాంబ్లర్ గా తెలుగులోకి అనువదించి, తెలుగులో కూడా విడుదల చేసిన విషయం విధితమే. అయితే తమిళంలో అయినంత హిట్ టాలీవుడ్ లో సాధించలేకపోయింది. యువ కథానాయికల జోరులో ఈ మధ్యకాలంలో కొంత వెనకబడిపోయిన త్రిష తెలుగులో తాజాగా వెంకటేష్ సరసన 'గంగ ది బాడీగార్డ్' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. త్వరలో త్రిష దమ్ము షూటింగ్ లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రిష ఎన్టీఆర్ తో జత కట్టడం ఇదే తొలిసారి.