Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'నేనేరా ఆది' అంటూ రెచ్చిపోతున్న త్రిష
త్రిషకు కెరిర్ చివరి దసకు వచ్చేసినా ఆమె డబ్బింగ్ సినిమాలు మాత్రం ఆమె ఉనికిని తెలుగు వారికి గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ రోజు అజిత్ నటించిన గ్లాంబ్లర్ చిత్రం విడుదలైంది.అందులో ఆమె హీరోయిన్ గా చేసింది. ఇక ఇదే స్పూర్తితో.. విజయ్, త్రిష కాంబినేషన్ లో రుపొందిన ఓ తమిళ చిత్రం ఇప్పుడు తెలుగులో 'నేనేరా ఆది' పేరుతో అనువాదమవుతోంది. రమణ దర్శకత్వం వహించారు. అభి పిక్చర్స్ పతాకంపై బి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం డబ్బింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత బి.సత్యనారాయణ మాట్లాడుతూ, 'తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే ఇతివృత్తంతో ఆద్యంతం ఆసక్తికరమైన స్క్రీన్ప్లేతో దీనిని రూపొందించారు. తమిళనాట విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుందన్న నమ్మకం ఉంది. గతంలో మేము ప్రేక్షకులకు అందించిన 'దోపిడీ', 'రగిలే కసి' చిత్రాలు మంచి లాభాలను అందించాయి. కొత్తదనాన్ని ఆదరించే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రకాష్రాజ్, సాయికుమార్ల నటన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సంగీత దర్శకుడు విద్యాసాగర్ అందించిన సంగీతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం పాటలు తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. త్వరలో అన్నికార్యక్రమాలను పూర్తిచేసి, అక్టోబర్లో సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో వివేక్, నాజర్, మణివన్నన్, సీత తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, ఛాయాగ్రహణం: ఎస్.సుందర్రాజన్, సమర్పణ: బి.ఎన్.ఎల్.రాజేశ్వరి, నిర్మాత: బి.సత్యనారాయణ, దర్శకత్వం: రమణ.ఇక తెలుగులో త్రిష ప్రస్తుతం వెంకటేష్ సరసన బాడీగార్డు రీమేక్ లో చేస్తోంది. డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలగు చిత్రం. వీటితో పాటు ఆమె బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న చిత్రం కోసం కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . ఇక ఈ చిత్రం టైటిల్ హరహర మహాదేవ. వీటితో పాటు విశాల్ సినిమాను కూడా ఓకే చేసింది.ఇక త్రిష హఠాత్తుగా విశాల్ ప్రాజెక్టుని ఎందుకు ఓకే చేసింది అంటే..దర్శకుడు తిరు చెప్పిన కథ నచ్చింది అంటోంది.ఆ కథ విని ధ్రిల్లయ్యానని అంటోంది.