Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ సారి ఊసరవెల్లి లా గెటప్ లు మార్చేది జూ ఎన్టీఆర్ కాదు త్రిష..!
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవి దమ్ము శరవేగంగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. బోయపాటి శ్రీను సింహా తరువాత చేస్తున్న సినిమా కాబట్టి నందమూరి ఫ్యాన్స్ లో సినిమా పై చాలా అంచనాలే పెట్టుకున్నారు. అంచనాలకు తగినట్టుగా బోయపాటి సినిమాను డిఫరెంట్ గా తీర్చి దిద్దుతున్నారు. ఈ సినిమాలో పాత్రలన్నింటికీ జాగ్రత్తగా నటుల ఎంపిక చేశారు.
భానుప్రియ ఎన్టీఆర్ తల్లిగా నటిస్తుండగా, బావగా వేణు నటిస్తున్నాడు. హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. రాధ కుమార్తె కార్తికను రెండవ హీరోయిన్ గా నటించనుంది. జూ ఎన్టీఆర్ దమ్ము నుండి శృతిహాసన్ వాక్ అవుట్ చేసిన తర్వాత ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిషను తీసుకోవడం జరిగింది. నటులను విభిన్నంగా ప్లాన్ చేసిన బోయపాటి, వారి పాత్రలను కూడా కొత్తగా తీర్చి దిద్దుతున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష మూడు గెట్ అప్ లలో కనిపించనుందట. అలాగే ఎన్టీఆర్ కూడా ఎక్కువ గెట్ అప్స్ లోనే కనిపిస్తాడట. ఎన్టీఆర్ తో మొదటి సారి జత కడుతుండటంతో త్రిష కూడా సినిమా పై ఆసక్తి గా ఉందని తెలుస్తుంది.
ఎన్టీఆర్ తో అవకాశం వచ్చే సరికి పెళ్ళి ఆలోచన కూడా వాయిదా వేసేసుకుంది. తమిళంలో అజిత్ సరసన చేసిన 'మంకత" చిత్రంతో త్రిష నలభై చిత్రాలు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఆమె ఈ మార్కు చేరుకుంది. ఇంకో పది సినిమాలు పూర్తి చేసి అర్థ శతకం అయ్యాక పెళ్ళి గురించి ఆలోచించాలని కూడా త్రిష నిర్ణయం తీసుకొందని సమాచారం.