Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
త్రిష తన ఇద్దరి బిడ్డలు గురించి ట్వీట్
హాట్ స్టార్ త్రిష తనకు ఇద్దరు బిడ్డలు ఉన్నారంటూ ట్వీట్ చేసింది. అలాగే మొదటి కొడుకు పేరు మైలో అంది. అయితే ఆమె చెప్పే బిడ్డలు మనష్యులు కాదు..కుక్క పిల్లలు. ఆమె రీసెంట్ గా బ్లూ క్రాస్ కి వెళ్లి కుక్కని తెచ్చుకుంది. ఈ విషయమై ఆమె ట్వీట్ చేస్తూ..ఇటీవల బ్లూ క్రాస్కి వెళ్లాను. అక్కడ ఒక బేబి నచ్చడంతో దత్తత తీసుకున్నాను. వీడు నా రెండో కొడుకు. మొదటి కొడుకు పేరు మైలో అంది. గతంలోనూ ఆమె రోడ్డుపై దొరికిన కుక్కను తీసుకెళ్లి... అనాధగా మిలిగిపోయింది.. ఎవరైనా దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇక ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ సరనస దమ్ము చిత్రం చేస్తోంది. ఆ చిత్రం గురించి చెప్తూ...పేరుకి తగ్గట్టే 'దమ్ము' ఫుల్ మాస్ సినిమా అంది. అలాగే ఆమె మరో ప్రక్క విశాల్ తో 'సమరన్'చేస్తోంది. ఇటీవల దాదాపు ఏడెనిమిది రోజులు బ్యాంకాక్, పటాయాలో జరిగిన 'సమరన్' షూటింగ్లో పాల్గొన్న త్రిష గురువారం 'దమ్ము' షూటింగ్లోకి ఎంటరయ్యింది. ఈ రెండు సినిమాల గురించి చెపుతూ.. 'పది రోజులు తమిళ్, మరో పది రోజులు తెలుగు... ఇలా భాషలు మార్చి మార్చి మాట్లాడం భలే థ్రిల్గా ఉంది. ఇలాంటి అవకాశం ఏ కొందరికో మాత్రమే వస్తుంది'' అంది. ఇక దమ్ములో త్రిషతో కార్తీక కూడా మరో హీరోయిన్ గా చేస్తోంది. ఎన్టీఆర్ ఆ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.