twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిష తన ఇద్దరి బిడ్డలు గురించి ట్వీట్

    By Srikanya
    |

    హాట్ స్టార్ త్రిష తనకు ఇద్దరు బిడ్డలు ఉన్నారంటూ ట్వీట్ చేసింది. అలాగే మొదటి కొడుకు పేరు మైలో అంది. అయితే ఆమె చెప్పే బిడ్డలు మనష్యులు కాదు..కుక్క పిల్లలు. ఆమె రీసెంట్ గా బ్లూ క్రాస్ కి వెళ్లి కుక్కని తెచ్చుకుంది. ఈ విషయమై ఆమె ట్వీట్ చేస్తూ..ఇటీవల బ్లూ క్రాస్‌కి వెళ్లాను. అక్కడ ఒక బేబి నచ్చడంతో దత్తత తీసుకున్నాను. వీడు నా రెండో కొడుకు. మొదటి కొడుకు పేరు మైలో అంది. గతంలోనూ ఆమె రోడ్డుపై దొరికిన కుక్కను తీసుకెళ్లి... అనాధగా మిలిగిపోయింది.. ఎవరైనా దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

    ఇక ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ సరనస దమ్ము చిత్రం చేస్తోంది. ఆ చిత్రం గురించి చెప్తూ...పేరుకి తగ్గట్టే 'దమ్ము' ఫుల్ మాస్ సినిమా అంది. అలాగే ఆమె మరో ప్రక్క విశాల్ తో 'సమరన్'చేస్తోంది. ఇటీవల దాదాపు ఏడెనిమిది రోజులు బ్యాంకాక్, పటాయాలో జరిగిన 'సమరన్' షూటింగ్‌లో పాల్గొన్న త్రిష గురువారం 'దమ్ము' షూటింగ్‌లోకి ఎంటరయ్యింది. ఈ రెండు సినిమాల గురించి చెపుతూ.. 'పది రోజులు తమిళ్, మరో పది రోజులు తెలుగు... ఇలా భాషలు మార్చి మార్చి మాట్లాడం భలే థ్రిల్‌గా ఉంది. ఇలాంటి అవకాశం ఏ కొందరికో మాత్రమే వస్తుంది'' అంది. ఇక దమ్ములో త్రిషతో కార్తీక కూడా మరో హీరోయిన్ గా చేస్తోంది. ఎన్టీఆర్ ఆ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

    English summary
    Trisha tweeted.."went to the bluecross and adopted this baby today, my 2nd son its the younger bro for mylo now tehee"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X