Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'జులాయి'లో అతీంద్రీయ శక్తులేం చూపించలేదు: త్రివిక్రమ్
హైదరాబాద్: ''మనలో చాలామందికి సిక్త్స్సెన్స్ ఉంటుంది. అది ఈ సినిమాలో హీరోకి ఇంకొంచెం ఎక్కువ ఉంది. అంతేగానీ అతీంద్రీయ శక్తులేం చూపించలేదు. సినిమా మొదలుపెట్టేముందు కథేమీ అనుకోలేదు. బన్నీ ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే కథ కోసం చాలారోజులు తర్జనభర్జన పడ్డాం. బన్నీ నన్ను పూర్తిగా నమ్మాడు. ఎందుకు? ఏమిటి? అని అడగలేదు. మంచి సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది''అని త్రివిక్రమ్ అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని పతాకంపై డి.వి.వి.దానయ్య, రాధాకృష్ణ నిర్మించిన జులాయి చిత్రం విజ యోత్సవ సభ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ ఇలా స్పందించారు. ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ ''సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా.. ప్రేక్షకులు నా కష్టాన్ని గుర్తిస్తున్నారు. నటుడిగా నన్ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తున్నారు. సినిమాని నేను రెండు భాగాలుగా చూస్తాను. ఒకటి పాటలు, రెండోది సినిమా. దేవీశ్రీ పాటలు ఎప్పుడో ప్రేక్షకులకు చేరువయ్యాయి. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. 'ఆర్య' నుంచి నా సినిమాలు మలయాళంలో బాగా ఆడుతున్నాయి. 'జులాయి'ని కూడా ఈ నెల 17న అక్కడ విడుదల చేస్తున్నాము''అన్నారు.
అలాగే.. ''హీరోగా నేనేం చేసినా... ఎంత పేరు తెచ్చుకొన్నా కేవలం అది దర్శకుల వల్లే. సినిమా అనేది సమష్టి కృషే అయినా... దర్శకుడి కష్టమే ఎక్కువ. 'జులాయి' విషయంలో కూడా త్రివిక్రమ్ ఎంతో శ్రమించారు''అని చెప్పారు అల్లు అర్జున్. ఇక తానిప్పటివరకు నటించిన చిత్రాలన్నింటికీ తొలిరోజు డివైడ్ టాక్ వచ్చిందని, ఏరోజైనా సినిమా హిట్ అన్న స్పందన మొదటి రోజు వినాలని ఎదురుచూశానని, ఆ బాధను జులాయి చిత్రం తీర్చిందని అల్లు అర్జున్ అన్నారు.
''ఈ రోజే ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశా. చాలా బాగుంది''అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. మలయాళంలో ఈనెల 17న విడుదల చేయనున్నామని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక కూడా జరుపుతామని, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని నిర్మాతలు డివివి.దానయ్య, రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు డి.వి.వి.దానయ్య, ఎస్.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.