Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తన అన్నయ్య గురించి ఫోన్ లో అలా చెప్పగానే మహేష్ మొహం ఎర్రబడింది: త్రివిక్రమ్ కామెంట్స్
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రమేష్ బాబు మరణవార్త ఒక్కసారిగా విషాదంలోకి నెట్టి వేసింది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందిన విషయం ప్రస్తుతం మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. మహేష్ అభిమానులు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అయితే మహేష్ బాబు ఈ సమయంలో చాలా శోకసంద్రంలో ఉంటాడు అని అర్థమవుతుంది. ఎందుకు అంటే గతంలో త్రివిక్రమ్ చెప్పిన ఒక విషయం తోనే మహేష్ తన సోదరుడిని ఎంత ఇష్టపడతాడో అర్థమవుతుంది.
కృష్ణ బిజీగా ఉన్నప్పుడు..
సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఘట్టమనేని కృష్ణ ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలో చాలా బిజీగా ఉండేవారు. రోజుకు రెండు మూడు సినిమాలతో గ్యాప్ లేకుండా పని చేస్తూ ఉండడంతో కుటుంబంతో చాలా తక్కువ సమయాన్ని గడిపేవారు. అయితే ఆ సమయంలో తన సిస్టర్స్ ను అలాగే తమ్ముడు మహేష్ బాబును కూడా పెద్ద కుమారుడు రమేష్ బాబు చూసుకునేవారు.
ప్రత్యేకమైన అనుబంధం
మహేష్ బాబుతో రమేష్ బాబుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తండ్రి కృష్ణ నుంచి వచ్చిన క్రమశిక్షణ వీరికి కూడా బాగా అలవాటు అయింది. తండ్రి సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు మహేష్ బాబు రమేష్ బాబు చిన్న తనంలోనే చాలా జాగ్రత్తగా చూసుకునే వారట. ఈ విషయాన్ని మహేష్ కూడా పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు.
మరో తండ్రి తరహాలో
సూపర్ స్టార్ కృష్ణ చిన్న తనంలోనే తన ఇద్దరు కొడుకులను కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చారు. షూటింగ్ లొకేషన్ లో కూడా వీరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేదట. ఒక విధంగా రమేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ తర్వాత మహేష్ బాబు కు మరో తండ్రి లాంటి వారు అని చాలామంది సినీ ప్రముఖులు కూడా చెప్పారు ల్. ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వారి బంధం గురించి అదే తరహాలో వివరించడం విశేషం.
ఫోన్ కాల్ రాగానే..
త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో రమేష్ బాబు మహేష్ బాబు మధ్య లో ఉన్న అనుబంధం గురించి చాలా క్లారిటీ గా వివరణ ఇచ్చారు. ఖలేజా సినిమా షూటింగ్ సమయంలో జరుగుతున్నప్పుడు హఠాత్తుగా మహేష్ బాబుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆ సమయంలో అతని మొహం ఒక్కసారిగా ఎర్రబడి పోయి దిగులుగా మారిపోయాడు.. అని త్రివిక్రమ్ చెప్పాడు.
బాధలోనే షూటింగ్
ఏంటని అడిగాను... తన సోదరుడు రమేష్ బాబు తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడని చెప్పాడు. నేను వెంటనే . మనం ఎందుకు ప్యాకప్ చేయకూడదు? దయచేసి మీరు మీ సోదరుడిని కలవండి అన్నాను. అయితే ఆ రోజు భారీ ఖర్చుతో చేస్తున్న సీన్స్ బిగ్ మూవీ కాబట్టి వదిలి ఆసుపత్రికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఆ బాధలోనే షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది.. అని త్రివిక్రమ్ అన్నారు.
చాలా కనెక్ట్ అయ్యాడు
ఇక సినిమా పూర్తయిన వెంటనే, మహేష్ తన సోదరుడిని చూడటానికి నేరుగా ఆసుపత్రికి వెళ్లాడు. మహేష్ తన సోదరుడికి చాలా కనెక్ట్ అయ్యాడు. తన తండ్రి వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్నప్పుడు మహేష్ బాగోగులు చూసుకున్న రమేష్ బాబు నిజానికి అతనికి తండ్రిలాంటివాడు.. అని త్రివిక్రమ్ వివరణ ఇచ్చారు.