Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్రివిక్రమ్ కే మొత్తం చెందుతుంది: అల్లు అర్జున్
హైదరాబాద్: అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం జులాయి. ఈ చిత్రం నిన్న గురువారం విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను ఈ రోజు(శుక్రవారం)హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ స్కిప్టు వల్లనే ఈ విజయం సాద్యమైందని అన్నారు. ఈ చిత్రం మళయాళ వెర్షన్ ఆగస్టు 17న విడుదలకు సిద్దమవుతోందని చెప్పారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ మొదట ఈ స్క్రిప్టు నేరేట్ చేసినప్పుడు.. నేను చాలా ఎక్సైట్ అయ్యాను.. అదే సమయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అయితే కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా త్రివిక్రమ్ తన స్కిప్టుకి,డైరక్షన్ కు న్యాయం చేసారు. తాను కేవలం త్రివిక్రమ్ స్కిప్టుని నమ్మి ఫాలో అయ్యాను.. ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు త్రివిక్రమ్ కి చాలా ధాంక్స్. ఈ క్రెడిట్ మొత్తం ఆయనదే. ఈ సినిమాకు సంభందించి మొత్తం మార్కులు త్రివిక్రమ్ కే పడతాయి అన్నారు.
అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి 'జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతున్నాయని సమర్పకుడు డీవీవీ దానయ్య అన్నారు. ''అర్జున్ శైలి నటన, నృత్యాలు ప్రధాన ఆకర్షణ. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా 'జులాయి' చిత్రానికి హైలైట్గా నిలుస్తున్నాయి'' అన్నారు .ఇక ఈ సక్సెస్ మీట్ లో.. త్రివిక్రమ్ శ్రీనివాస్, డివివి దానయ్య, నిర్మాత రాధాకృష్ణ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ ప్రవీణ్ పూడి హాజరయ్యారు.