Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
త్రివిక్రమ్ డైరక్షన్: రామ్ చరణ్, ధోణి లతో...
మరో ప్రక్క రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో త్వరలో ఓ మెగా మూవీ రాబోతోంది. విశ్వసనీయంగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. 2010లో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ పెప్సి యాడ్లో నటించినప్పటి నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ....ఈ సారి మాత్రం ఈ వార్త నిజం కాబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై నిర్మాత,మిగతా సాంకేతిక నిపుణల సమాచారంతో కూడిన పూర్తి ప్రకటన వచ్చే అవకాసం ఉంది.
ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఓకే అయిందని, ప్రస్తుతం ఈ ఇద్దరు కమిటైన సినిమాలు పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఫ్లోర్ మీదకు రానున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టు వర్కు, డైలాగులు తదితర పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సినిమా చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం పూర్తయిన తర్వాత చరణ్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన 'ఎవడు' విడుదలకు సిద్దంగా ఉంది.