Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పవన్తో స్ర్కీన్ పంచుకోబోతున్న త్రివిక్రమ్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'సరదా'(తాత్కాలిక టైటిల్) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిల్మ్ నగర్ లోని ఓ దేవాలయంలో జరుపుకుంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'సరదా' చిత్రంలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడట. సినీ పరిశ్రమలోకి డైలాగ్ రైటర్ గా తన ప్రస్తానం ప్రారంభించిన త్రివిక్రమ్ తన పదునైన రచనా నైపుణ్యంతో అనతి కాలంలోనే పాపులర్ డైలాగ్ రైటర్గా ఎదిగారు. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు కేవలం 5 మాత్రమే. అయినా అతని సినిమాలంటే జనాల్లో మహా క్రేజ్ ఏర్పడిందంటే ఆయన పనితనం అర్థం చేసుకోవచ్చు.
మరి ఇంత వరకు తెర వెనక ఉన్న త్రివిక్రమ్.... ఇప్పుడు తెరపైకి వస్తున్నారు. మరి నటనలో తన నైపుణ్యం ఏ రేంజిలో చూపిస్తారో చూడాలి. మరో విషయం ఏమిటంటే... పవన్ కళ్యాణ్ ప్రొత్సాహంతోనే త్రివిక్రమ్ ఈచిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారట. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే డిసెంబర్ నుంచి జరుగుతుందని తెలుస్తోంది. సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఎంపికయింది.
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్లను కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.