Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
త్రివిక్రమ్ చెప్పిన కిటుకుతో రెచ్చిపోతానంటున్న నితిన్
హైదరాబాద్ : గతకొన్నేళ్లుగా సరైన హిట్ లేక వరుస ప్లాపులతో అల్లాడిన యువహీరో నితిన్...ఈ మధ్య ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో వరుస హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం విడుదలైనప్పటి నుంచి నితిన్కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
పలువురు చిత్ర నిర్మాతల, దర్శకులు, హీరోలు ఈ చిత్రం చూసి సినిమా చాలా బాగుంది అంటూ నితిన్కు ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. అందరిలోకెల్లా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ప్రశంసలను మాత్రం బెస్ట్ కంప్లిమెంట్గా పీలవుతున్నాడు నితిన్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నితిన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ....'గుండెజారి గల్లంతయ్యిందే విడుదలైన కొన్ని రోజులకు దర్శకుడు త్రివిక్రమ్ నుంచి కాల్ వచ్చింది. సినిమా బాగుంది, బాగా చేసావని ప్రశంసించారు. ఆయన చెప్పిన విషయాల వల్ల నాకు అర్థమైంది నా యొక్క బలం ఏమిటో...' అని వ్యాఖ్యానించారు.
'త్రివిక్రమ్ నాతో ఏంచెప్పాడంటే....ఇష్క్ సినిమాలో షో అంతా నిత్యామీనన్ మీదనే నడిచింది. ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. కానీ గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో అలా జరుగలేదు. సినిమా మొత్తాన్ని నా భుజాల మీదనే మోసానని అర్థమైంది. ఆయన కాంప్లిమెంట్ ఎప్పటికీ మరిచిపోను. నా ఏజ్కు సరిపోయే కథలను ఎంచుకుని, ప్రేక్షకులకు మెచ్చే చిత్రాలు చేయడానికి ప్రత్నిస్తాను' అని చెప్పుకొచ్చారు నితిన్.
ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన యామి గౌతమి హీరోయిన్గా చేస్తోంది.