Don't Miss!
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- News గజలక్ష్మీ యోగం.. సరిగ్గా ఐదు రోజుల్లో వీరికి డబ్బే డబ్బు
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అల్లు అర్జున్ చిత్రానికి బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న త్రివిక్రమ్
తెలుగు చిత్రపరిశ్రమ ప్రస్తుతం అధిక బడ్జెట్ తో సతమతమవుతున్న నేపథ్యంలో దర్శకులు, నటీనటులు తమ రెమ్యునేషన్ తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను చేస్తున్న తాజా చిత్రానికి రేటు తగ్గించుకున్నారు. అల్లు అర్జున్, ఇలియానా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అంతే కాకుండా సినిమాకు పని చేస్తున్న ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాల వారిని కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టాడట. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ ఇలియానా, సంగీత దర్శకుడు దేవిశ్రీతో కూడా త్రివిక్రమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వీటితో పాటు ప్రొడక్షన్ విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ తో సినిమా అంటే బడ్జెట్ తో పనే అన్న రూమర్ ని ఈ సినిమాతో తొలగించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 30 కోట్లలోపే చిత్రాన్ని పూర్తి చేయాలని త్రివిక్రమ్ కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో చిత్ర నిర్మాత దానయ్య మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. నవంబర్ 2వ తేదీ నుంచి ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
నిర్మాత పచ్చగా ఉంటేనే పరిశ్రమ పచ్చగా ఉంటుందని ప్రతి సందర్భంలోనూ సినీ ప్రముఖులు చెబుతూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో త్రివిక్రమ్ ప్రయత్నం అందరి చూపును తనవైపు తిప్పుకునేలా చేసింది.