Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ చిత్రానికి బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న త్రివిక్రమ్
తెలుగు చిత్రపరిశ్రమ ప్రస్తుతం అధిక బడ్జెట్ తో సతమతమవుతున్న నేపథ్యంలో దర్శకులు, నటీనటులు తమ రెమ్యునేషన్ తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను చేస్తున్న తాజా చిత్రానికి రేటు తగ్గించుకున్నారు. అల్లు అర్జున్, ఇలియానా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అంతే కాకుండా సినిమాకు పని చేస్తున్న ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాల వారిని కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టాడట. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ ఇలియానా, సంగీత దర్శకుడు దేవిశ్రీతో కూడా త్రివిక్రమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వీటితో పాటు ప్రొడక్షన్ విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ తో సినిమా అంటే బడ్జెట్ తో పనే అన్న రూమర్ ని ఈ సినిమాతో తొలగించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 30 కోట్లలోపే చిత్రాన్ని పూర్తి చేయాలని త్రివిక్రమ్ కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో చిత్ర నిర్మాత దానయ్య మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. నవంబర్ 2వ తేదీ నుంచి ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
నిర్మాత పచ్చగా ఉంటేనే పరిశ్రమ పచ్చగా ఉంటుందని ప్రతి సందర్భంలోనూ సినీ ప్రముఖులు చెబుతూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో త్రివిక్రమ్ ప్రయత్నం అందరి చూపును తనవైపు తిప్పుకునేలా చేసింది.