Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రూమర్లకు తెరదించిన త్రివిక్రమ్.. అవాస్తవాలు.. అలాంటిదేమీ లేదని క్లారిటీ..
Recommended Video
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే చిత్రంపై సూపర్ క్రేజ్ నెలకొన్నది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా ప్రారంభమైన ఈ చిత్రంపై అనేక రూమర్లు ఫిలిం సర్కిళ్లలో షికారు చేస్తున్నాయి. అయితే ఇటీవల ఆ చిత్రంపై వస్తున్న అన్ని రకాల గాసిప్స్కు త్రివిక్రమ్ తెరదించారు. మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.
నితిన్ సినిమా మాదిరిగానే...
ఈ మధ్య నితిన్, సమంతతో తీసిన ఆ ఆ చిత్రం కొంత వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత్రి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత త్రివిక్రమ్ స్పందించి ఆ రచయిత్రికి క్రెడిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
నవల ఆధారంగా కాదు
సరిగ్గా ఆ ఆ చిత్రానికి సంబంధించిన వార్త మాదిరిగానే తాజాగా మరో వార్త తెరమీదకు వచ్చింది. 80 దశకంలో బాగా పాపులర్ అయిన ఓ నవలను భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకొన్నాడు అనే వార్త వైరల్గా మారింది. దాంతో త్రివిక్రమ్ తన సన్నిహితుల వద్ద స్పందించాల్సి వచ్చిందట.
ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ
ఎన్టీఆర్తో తీయబోయే చిత్రం ఏ నవలకు ఆధారం కాదు. అందులో వాస్తవం లేదు. తాను రూపొందించబోయే చిత్రం సకుటుంబ సపరివారంగా చూసే సినిమా. తాను రూపొందించిన కుటుంబ కథా చిత్రాల్లో మాదిరిగానే ఉంటుంది అని త్రివిక్రమ్ వివరణ ఇచ్చారట.
టాలీవుడ్కు టబు
ప్రముఖ హీరోయిన్ టబు ఎంపిక ఖారారైంది. తాను చెప్పిన కథ బాగా నచ్చడంతో చాలా రోజుల తర్వాత తెలుగులో నటించడానికి టబు ముందుకు వచ్చింది. మహిళా ప్రాధాన్యం ఉన్న కథ కావడంతో ఆమె ఆసక్తి చూపించారనేది తాజా సమాచారం. బాలకృష్ణతో పాండురంగడు చిత్రం తర్వాత మరే చిత్రంలో కనిపించిన దాఖలాలు లేవు.
వచ్చే ఏడాది సెట్స్ పైకి
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సెట్స్మీదకు వెళ్లనున్నది. ప్రస్తుతం పవన్ కల్యాణ్తో రూపొందిస్తున్న చిత్ర షూటింగ్లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యూరప్లో షూటింగ్ జరుపుకొంటున్నది.
పీఎస్పీకే25 పాట రిలీజ్
నవంబర్ 7 తేదీన త్రివిక్రమ్ జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పీఎస్పీకే25 చిత్రానికి సంబంధించిన పాటను పూర్తిస్థాయిలో రిలీజ్ చేశారు. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ బర్త్ డే రోజు కొంత భాగాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.