Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్రివిక్రమ్ మాటతో ఆగిపోయిన ఎన్టీఆర్.. విలువైన సలహా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా నటించిన అరవింద సమేత చిత్రం మంచి విజయం సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాక్షన్ డ్రామా మాస్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా అరవింద సమేత నిలిచింది. ఈ చిత్రంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ స్నేహితులుగా మారిపోయారు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ చాలా తక్కువ మందితో స్నేహంగా ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా త్రివిక్రమ్ ఆప్త మిత్రుడిగా మారిపోయారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం విషయంలో నందమూరి కుటుంబం గురించి ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ సోదరి పోటీ
కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీలో నిలిచింది. సుహాసిని కోసం ఆమె సోదరులు ఎన్టీఆర్, కళ్యణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తారని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ ఎన్నికల ప్రచారానికి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో సుహాసిని ఓడిపోయారు.
ప్రెస్ నోట్ మాత్రమే
సుహాసినిని టిడిపి తరుపున అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరి విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనకపోవడానికి బలమైన కారణం ఉందట. ఎన్టీఆర్ సన్నిహితులు చాలా మంది ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. తన సన్నిహితుల సలహాని పాటించడం వలనే ఎన్టీఆర్ క్యాపైనింగ్ లో పాల్గొనలేదని అంటున్నారు.
త్రివిక్రమ్ విలువైన సలహా
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్టీఆర్ కు సూచించించినట్లు ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. కెరీర్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో ఎలక్షన్స్ జోలికి వెళ్లవద్దని త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు సుచించాడట. ముందుగా ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ సమయంలో అది సరైన నిర్ణయం కాదని త్రివిక్రమ్ చెప్పడంతో ఎన్టీఆర్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్తో బిజీగా
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడని వినికిడి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో హీరోగా కనిపించబోతున్నాడు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.