Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
త్రివిక్రమ్, కళ్యాణ్ రామ్, బోయాపాటి, వినాయక్, వైట్ల విరాళం
హైదరాబాద్: హుధూద్ సూపర్ సైక్లోన్ ధాటికి నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తుఫాన్ బాధితులకు సహాయం చేసేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కరొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో టాలీవుడ్ డైరెక్టర్లు వివి వినాయక్, త్రివిక్రమ్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, యాక్టర్లు కళ్యాణ్ రామ్, సునీల్, సాయి కొర్రపాటి కూడా చేరి పోయారు.
దర్శకుడు త్రివిక్రమ్ రూ. 10 లక్షలు, వివి వినాయక్ రూ. 10 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షల, బోయపాటి శ్రీను రూ. 7 లక్షలు, శ్రీను వైట్ల రూ. 5 లక్షలు, యాక్టర్ సునీల్ రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. వారాహి చలన చిత్రం అధినేత, నిర్మాత సాయి కొర్రపాటి 100 టన్నులు (లక్ష కేజీలు) బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రముఖులైన పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల విరాళం, రామానాయుడు కుటుంబం రూ. 50 లక్షలు, కృష్ణ కుటుంబం రూ. 50 లక్షలు, బాలయ్య రూ. 30 లక్షలు+15 లక్షల సరుకులు, ప్రభాస్ 20 లక్షలు, అల్లు అర్జున్ 20 లక్షలు, నాగార్జున 20 లక్షలు, జూ ఎన్టీఆర్ 20 లక్షలు, రామ్ చరణ్ 15 లక్షలు, కృష్ణ 15, రవితేజ, రామ్ , నితిన్, విజయ నిర్మల 10 లక్షల చొప్పున విరాళం అందించిన సంగతి తెలిసిందే.