Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్రివిక్రమ్, కళ్యాణ్ రామ్, బోయాపాటి, వినాయక్, వైట్ల విరాళం
హైదరాబాద్: హుధూద్ సూపర్ సైక్లోన్ ధాటికి నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తుఫాన్ బాధితులకు సహాయం చేసేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కరొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో టాలీవుడ్ డైరెక్టర్లు వివి వినాయక్, త్రివిక్రమ్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, యాక్టర్లు కళ్యాణ్ రామ్, సునీల్, సాయి కొర్రపాటి కూడా చేరి పోయారు.
దర్శకుడు త్రివిక్రమ్ రూ. 10 లక్షలు, వివి వినాయక్ రూ. 10 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షల, బోయపాటి శ్రీను రూ. 7 లక్షలు, శ్రీను వైట్ల రూ. 5 లక్షలు, యాక్టర్ సునీల్ రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. వారాహి చలన చిత్రం అధినేత, నిర్మాత సాయి కొర్రపాటి 100 టన్నులు (లక్ష కేజీలు) బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రముఖులైన పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల విరాళం, రామానాయుడు కుటుంబం రూ. 50 లక్షలు, కృష్ణ కుటుంబం రూ. 50 లక్షలు, బాలయ్య రూ. 30 లక్షలు+15 లక్షల సరుకులు, ప్రభాస్ 20 లక్షలు, అల్లు అర్జున్ 20 లక్షలు, నాగార్జున 20 లక్షలు, జూ ఎన్టీఆర్ 20 లక్షలు, రామ్ చరణ్ 15 లక్షలు, కృష్ణ 15, రవితేజ, రామ్ , నితిన్, విజయ నిర్మల 10 లక్షల చొప్పున విరాళం అందించిన సంగతి తెలిసిందే.