Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
అదిరిపోయిన అప్డేట్.. పవన్ కళ్యాణ్ కోసం కదిలి వచ్చిన త్రివిక్రమ్
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇంత కంటే మంచి పండుగ ఏది ఉంటుంది. అడక్కుండానే సర్ ప్రైజ్లు ఇస్తున్నారు. ఆల్రెడీ నిన్న వదిలిన వకీల్ సాబ్ టీజర్ మానియాలోంచే ఇంకా ఎవ్వరూ బయటకు రాలేకపోతున్నారు. సరిగ్గా 24 గంటలకు మరో సర్ ప్రైజ్ అంటే వారి ఆనందానికి హద్దులుంటాయా? ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇదే పరిస్థితులో ఉన్నారు. నిన్న ఇదే సమయానికి వకీల్ సాబ్ టీజర్తో రచ్చ చేస్తే నేడు మరో అప్డేట్తో సందడి చేస్తున్నారు.
రీమేక్పై రచ్చ..
మలయాళి హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ ప్రాజెక్ట్పై ఎన్ని రకాల రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రీమేక్ ఎంతో మంది హీరోల దగ్గరకు వెళ్లింది. ఎన్నో కాంబినేషన్లను చూశారు. చివరకు మాత్రం అదిరిపోయే కాంబినేషన్ సెట్ అయింది. పవన్ కళ్యాణ్ రానా కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోందని అధికారికంగా ప్రకటించేశారు.
పవర్ ఫుల్ పోలీసాఫీసర్..
గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ మళ్లీ అంతటి పవర్ ఫుల్ ఖాకీ పాత్రలో కనిపించలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ చేశాడు. కానీ అంతగా వర్కవుట్ కాలేదు. కానీ ఈ సారి మాత్రం అంతకు మించి అనేలా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ పోషించనున్నాడు. ఈ మేరకు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్పై చిత్రయూనిట్ అధికారికంగా వదిలిన ఫస్ట్ గ్లింప్స్లోనే ఎన్నో వివరాలను చెప్పేశారు.
సంక్రాంతికి ముగింపు..
అయితే సంక్రాంతి వేడుకలంటే టాలీవుడ్లో సినిమాల సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఓ వైపు సినిమా విడుదల, మరో వైపు కొత్త సినిమా అప్డేట్లు, టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లతో అంతా సందడి వాతావరణం నెలకొంటుంది. అలా భోగి, సంక్రాంతికి ఎన్నో అప్డేట్లు వచ్చాయి. కానీ ఇలా కనుమ రోజు చివరగా పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్లతో పండుగను ముగించేసేందుకు భారీ ప్లాన్ వేశారు.
రూమర్ నిజమైంది..
అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్లో త్రివిక్రమ్ పాలు పంచుకుంటాడని, మాటలు రాస్తున్నాడని స్క్రిప్ట్ను తెలుగు ప్రేక్షకులను నచ్చేట్టుగా మలుచుతున్నాడని వార్తలు వచ్చేవి. చివరకు అదే నిజమైంది. కనుమ సందర్భంగా తాజాగా ఇచ్చిన అప్డేట్లో ఆ విషయాన్ని చెప్పారు. త్రివిక్రమ్ను తమ ప్రాజెక్ట్లోకి స్వాగతిస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.