Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగు దర్శకుడు డైరక్ట్ చేసారు.. రిలీజై 14 ఏళ్లైనా ఇంకా ఆడుతోంది
ముంబయి: జెనీలియా తొలి చిత్రం 'తుఝే మేరీ కసమ్' వచ్చి 14 సంవత్సరాలు అవుతోంది. 2003లో విడుదలైన ఈ చిత్రంలో జెనీలియా..భర్త రితేశ్ దేశ్ముఖ్, శ్రియాలతో కలిసి నటించింది.2000 సంవత్సరంలో తెలుగులో వచ్చిన 'నువ్వేకావాలి' సినిమాకి రీమేక్గా వచ్చింది.
ఇప్పుడు హఠాత్తుగా ఈ చిత్రం గురించి టాపిక్ ఏమిటీ అంటే.. ఈ చిత్రం 14 ఏళ్లు కావొస్తున్నా మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని ఓ థియేటర్లలో ఇంకా ఆడుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు విజయ్ భాస్కర్ డైరక్ట్ చేసారు. ఈ విషయాన్ని రితేశ్ దేశ్ముఖ్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఫొటో పోస్ట్ చేశాడు.
Tujhe Meri Kasam - Our debut film playing in the theatres along with the latest releases in Maharashtra (Nanded) #14thYear #ThankYou #Love pic.twitter.com/fRhKEuP5va
— Riteish Deshmukh (@Riteishd) November 6, 2016
'నువ్వేకావాలి' సినిమాకు రీమేక్ గా తీసిన 'తుఝే మేరీ కసమ్' సినిమా ద్వారా జెనీలియా, రితేష్ లు తొలిసారి బాలీవుడ్ లో తెరంగేట్రం చేశారు. ఆ పరిచయం స్నేహమై, స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2012లో వైభవంగా వివాహం చేసుకున్నారు.
Some films will always be special and they continue to prove they are too.. Thank you for the love.. Tujhe Meri Kasam https://t.co/yonuhRScp1
— Genelia Deshmukh (@geneliad) November 6, 2016
అనోన్యమైన జంటగా వీరికి మంచి పేరుంది కూడా. ఇద్దరు పిల్లల తల్లి అయిన జెనీలియా వెండితెరకు తాత్కాలికంగా దూరమయ్యారు. పలు విజయవంతమైన చిత్రాలతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆమె తిరిగి వెండితెరపై మెరవాలనే అభిమానుల ఆశ త్వరలో నెరవేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు తాజాగా విడుదలైన శివాయ్, యే దిల్ హై ముష్కిల్, ప్రియాంక చోప్రా నిర్మించిన మరాఠీ చిత్రం 'వెంటిలేటర్' ఆడుతుండడం విశేషం. ఈ సినిమానే కాకుండా 1995లో షారుక్, కాజోల్లు నటించిన 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమా ఇప్పటికీ ముంబయిలోని మరాఠా మందిర్లో ఆడుతున్న సంగతి తెలిసిందే.