twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూపింది చాలంటూ సూచన!

    By Staff
    |

    Mumbai Blasts
    ముంబై దాడుల కథనాలు ఇక ఆపండి అంటూ..టీవీ చానళ్లకు సమాచార శాఖ సూచనలు చేసింది.ఇక ఇప్పటికి చూపెట్టింది చాలని ఇక నుంచి ముంబై దాడికి సంబంధించిన క్లిప్పింగులను ప్రదర్శించడం మానుకోవాలని సమాచార, ప్రసారశాఖ టీవీ చానళ్లకు సూచించింది. ఈ దృశ్యాలను పదేపదే చూపించడం వల్ల బాధితుల్లో తగ్గుతున్న బాధ పెరుగుతుందని చెప్పింది. బుధవారం రాత్రి జరిగిన సమాచార, ప్రసార శాఖ అధికారుల సమావేశంలో ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు.

    ఈ దుర్ఘటనకు సంబంధించిన కథనాల ప్రసారం వల్ల, తాము విజయం సాధించినట్టు ఉగ్రవాదులు భావిస్తారని, అందువల్ల వీటి ప్రసారాన్ని ఆపేయాలని తెలిపింది. ప్రసారాలపై చానళ్లు స్వయం నియంత్రణ పాటించాలని పేర్కొంది. టెలివిజన్‌ ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌ (టీఏఎం) గత నెలాఖరుకు జరిపిన సర్వే ప్రకారం, ఈ దాడి ప్రసారం వల్ల దేశంలోని వార్తా చానళ్లు చూసేవారి సంఖ్య 180 శాతం పెరిగిందని తెలిపింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X