రాంగోపాల్ వర్మ ఇకలేరు.. ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్ నివాళి
రాంగోపాల్ వర్మ, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య మాటల వివాదం తీవ్ర స్థాయికి చేరింది. కాళ్లు నాకే కుక్కల కంటే మొరిగే కుక్కలు నయం అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలకు పవన్ అభిమానులు ఇంకో అడుగు ముందేశారు.
రాంగోపాల్ వర్మ, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య మాటల వివాదం తీవ్ర స్థాయికి చేరింది. కాళ్లు నాకే కుక్కల కంటే మొరిగే కుక్కలు నయం అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలకు పవన్ అభిమానులు ఇంకో అడుగు ముందేశారు.

వర్మ ఆత్మకు శాంతి కలుగాలి
రాంగోపాల్ వర్మ ఆకస్మికంగా మరణించాడు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలి అనే విధంగా ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటో ముందు దీపం వెలిగించి రాంగోపాల్ వర్మకు దండ వేశారు. అలాగే శవయాత్ర చేస్తున్న మరో ఫోటోను కూడా జత చేశారు.

లవ్ యూ మై స్వీట్ డార్లింగ్స్
ఆ ఫోటోకు సమాధానంగా లవ్ యూ మై స్వీట్ డార్లింగ్స్, లవ్లీ బ్యూటిఫుల్ పీకే ఫ్యాన్స్. మీ అందరికి గాఢమైన ఆలింగనం అంటూ వర్మ జవాబిచ్చారు.
చదువురాని గొర్రెలకు ..
చదువురాని గొర్రెలకు ఇంకా అర్థం కావడం లేదు. ఇప్పటికే మూడు జన్మలెత్తి మరణించాను. ఇప్పుడు దయ్యం రూపంలో ఉన్నాను. దెయ్యాలు ఇక మరణించదు. ఎందుకంటే అవి జీవితాంతం మరణ దశలోనే ఉంటాయి కనుక అని వర్మ మరో ట్వీట్ చేశారు.

ఎప్పటికీ నంబర్ వన్ నంబర్
లక్షలాది ఫ్యాన్కు ఎదురుగా నేను ఒక్కడినే. లక్షల జీరోలు అందరూ కలిసినా జీరోలే. ఎప్పటికీ నంబర్ వన్ నంబర్ వన్ యే అని వర్మ ట్వీట్ చేశారు.
ఇప్పుడే ఫ్యాన్స్ అధ్యక్షుడితో మాట్లాడాను.
ఇప్పుడే ఫ్యాన్స్ అధ్యక్షుడితో మాట్లాడాను. తాను ఆ సినిమా చూడటం లేదు ఎందుకంటే ఆ డబ్బులను మిగుల్చుకొని బాహుబలి2 సినిమాను మళ్లీ మళ్లీ చూడాలి అనే కారణాన్ని చెప్పారు.


Click it and Unblock the Notifications











