Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
క్షమాపణ చెప్పారు : దాడి ఘటనపై రామ్ చరణ్ స్పందన
ఆ ఇద్దరు వ్యక్తులు రాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు, బ్యాడ్గా బిహేవ్ చేసినట్లు రామ్ చరణ్ పేర్కొన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా కేసు నమోదు కాలేదు. ఈ విషయంలో పోలీసులు తీరును రామ్ చరణ్ ప్రశంసించారు. పోలీసులు పూర్తి విచారణ జరిపి నిజా నిజాలు తెలుసుకున్నారని, తమ తప్పు ఉన్నందు వల్లనే ఆ ఇద్దరు వ్యక్తులు కంప్లైంట్ చేయలేదని రామ్ చరణ్ తెలిపారు. ఈ సంఘటన విషయంలో నిజాయితీగా వ్యవహరించిన పోలీసులకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.....దాడి జరిగి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా పోలీసులు కేసు నమోదు చేయక పోగా, దానికి బాధితులు ఫిర్యాదు చేయలేదనే సాకు చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బున్నోళ్ల కండకావరానికి ఇది నిదర్శనమనే వాదనా వినిపిస్తోంది. సలీం అనే న్యాయవాది ఈ ఘటనపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసారు.
దాడి సంఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయాలని, బాధితులు ఫిర్యాదు చేయలేదనే కారణంగా కేసు పెట్టక పోవడం వెనక కేంద్ర మంత్రి చిరంజీవి ఒత్తిడి ఉందని ఆయన పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా దాడి కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. న్యాయవాది పిటీషన్ను విచారణకు స్వీకరించిన హెచ్ఆర్సి ఈ వ్యవహారంపై జూన్ 18లోగా వివరణ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ను ఆదేశించింది.