Don't Miss!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హిట్టు మాహాత్యం.. సాయి ధరమ్ తేజ్ కోసం ఇద్దరు బడా నిర్మాతలు
సినిమా ఇండస్ట్రీలో హిట్టు పడితే చాలు హీరోల వద్దకు గ్యాప్ లేకుండా నిర్మాతల నుంచి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఇక సాయి ధరమ్ తేజ్ కి కూడా ప్రస్తుతం ఆఫర్స్ అలానే వస్తున్నాయి. ఎందుకంటే చివరగా ఈ హీరో నుంచి వచ్చిన ప్రతి రోజు పండగే సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మెగా హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకుంది.
అంతకుముందు వచ్చిన చిత్రలహరి సినిమా కూడా ఈ హీరో కెరీర్ కి మంచి క్రేజ్ అందించింది. సాధారణంగా సాయి అపజయాల్లో ఉన్నప్పుడే ఆఫర్స్ గట్టిగానే వచ్చాయి. ఇక హిట్స్ వచ్చాక మెగా హీరో ఎంత బిజీగా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నెక్స్ట్ వరుసగా నాలుగు కథలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సోలో బ్రతుకే సో బేటర్ అనే సినిమాను పూర్తి చేసిన సాయి కరోనా వైరస్ తగ్గిన తరువాత ఆ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఆ తరువాత ప్రస్థానం దర్శకుడు దేవకట్టా డైరెక్షన్ లో ఒక సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాను ఇద్దరు సీనియర్ నిర్మాతలు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
వారు మరెవరో కాదు. BVSN ప్రసాద్ - దిల్ రాజు. ఈ ఇద్దరు బడా నిర్మాతలు కూడా సాయి ధరమ్ తేజ్ - దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని సంయుక్తంగా నోర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ నిర్మాతలతో ఒకసారి పని చేసిన సాయి ఇప్పుడు కొంచెం కొత్తగా ఇద్దరితో కలిసి పనిచేస్తుండడం విశేషం. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.