Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ప్రేమించిన అమ్మాయితో ఉదయ్ కిరణ్ వివాహం
ఉదయ్ కిరణ్ ఈ విషయమై మాట్లాడుతూ... ''ఓ పుణ్యక్షేత్రంలో పెళ్లి చేసుకోబోతున్నాను. నిరాడంబరంగా ఆ వేడుక ఉంటుంది'' అని తెలిపారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'చిత్రం'తో హీరోగా ఉదయ్ తొలి అడుగువేశారు. ఆ తరవాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే'లాంటి చిత్రాలతో దూసుకెళ్లారు. ఆ తరవాత కెరీర్పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఉదయ్ కిరణ్ సెకండ్ ఇన్నింగ్స్ తరహాలో మొదలెట్టి చేస్తున్న చిత్రం 'జై శ్రీరామ్'. రేష్మ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బాలాజీ ఎన్.సాయి దర్శకత్వం వహిస్తున్నారు. తేళ్ల రమేష్, ఎన్.సి.హెచ్.రాజేష్ నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ ''ప్రాణాల్నిపణంగా పెట్త్టెనా అనుకొన్నది సాధించే పోలీసు అధికారి పాత్రలో ఉదయ్కిరణ్ ఒదిగిపోయారు. యాక్షన్, వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది''అన్నారు.
ఇక ఈ చిత్రం స్టోరీ గురించి హీరో ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...ఎక్కడ అన్యాయం జరుగుతోందంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు శ్రీరామ్. నేరస్తుల పాలిట సింహ స్వప్నం. అవసరమనుకొంటే నియమ నిబంధనల్ని పక్కనపెడతాడు. వృత్తి తప్ప మరో వ్యాపకం తెలియని ఆ అధికారి జీవితంలోకి ఓ యువతి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ తరవాత శ్రీరామ్కి వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? లాంటి విషయాల్ని తెరపైనే చూడాలంటున్నారు.
అలాగే ''ఇప్పటివరకూ వచ్చిన పోలీస్ కథలకు పూర్తి భిన్నంగా 'జై శ్రీరామ్' ఉంటుంది. స్క్రీన్ప్లే ఈ చిత్రానికి ప్రధానబలం. లవ్, యాక్షన్, సెంటిమెంట్... ఇలా అన్ని ఎలిమెంట్లూ ఇందులో ఉంటాయి. పతాక సన్నివేశాల్లో నా లుక్ చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. సింహా, దూకుడు, ఈగ చిత్రాల్లో నటించిన ఆదిత్య మీనన్ ఇందులో మెయిన్ విలన్గా నటిస్తున్నారు. విలన్ తండ్రిగా ఓ ప్రముఖ నటుణ్ణి సర్ప్రైజింగ్గా పరిచయం చేస్తున్నాం'' అని ఉదయ్కిరణ్ చెప్పారు.