Don't Miss!
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఉదయ్ కిరణ్ 'ప్రేమకథ'
ఉదయ్ కిరణ్, శ్వేతబసు ప్రసాద్ జంటగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై డి.కుమార్, ఈశ్వర వరప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. తమిళంలో 'రామేశ్వరం' చిత్రానికి దర్శకత్వ వహించిన సుభా సెల్వం ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం హైద్రాబాద్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ కు రెడీ అవుతోంది.
నిర్మాతలు ఈ విశేషాలను తెలియజేస్తూ, ఉదయ్ కిరణ్ కెరీర్ లో గుర్తుండిపోయే చక్కటి ప్రేమకథా ఇతివృత్తంలో ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, తొలి షెడ్యూల్ లో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారనీ తెలిపారు. ఇదే నెలలో రెండో షెడ్యూల్ హైద్రాబాద్ లో మొదలవుతుందనీ, ఈ షెడ్యూల్ లో కూడా సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందన్నారు. అక్టోబర్ లో మూడో షెడ్యూల్ ను పాండిచ్చేరిలో ప్లాన్ చేసినట్టు తెలిపారు. అక్కడ 3 పాటలు, కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపడతామని చెప్పారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. కథను నమ్ముకుని చేస్తున్న సినిమా ఇదనీ, హదయాన్ని కదిలించే ప్రేమ కథ ఇది, ప్రేమలోని కొత్త కోణాన్ని ఇందులో ఆవిష్కరిస్తున్నామనీ సుభా సెల్వం తెలిపారు.మంచి సృజనాత్మకత ఉన్న దర్శకుడు, అభిరుచి గల నిర్మాతలు తీస్తున్న ఈ చిత్రం తన కెరీర్ కు మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నట్టు ఉదయ్ కిరణ్ తెలిపారు. మనసుకు హత్తుకునే ఇలాంటి చిత్రంలో చేస్తుండటం సంతోషంగా ఉందని శ్వేతబుసు ప్రసాద్ పేర్కొంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ కోనేరు సంగీతం అందిస్తున్నారు.