Don't Miss!
- Sports SRH vs MI: ఆ దిగ్గజ క్రికెటర్ వల్లనే చరిత్ర సృష్టించా- అభిషేక్ శర్మ
- News విజయవాడ పశ్చిమ సీటులో మారిపోయిన లెక్కలు !
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
హీరో ఉదయ్ కిరణ్కు దెబ్బ మీద దెబ్బ!
చిత్రం, మనసంతా నువ్వే, నువ్వునేను లాంటి హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్ సినీ కెరియర్ ప్రస్తుతం ఉంటుందా? ఊడుతుందా అనే చందంగా కొట్టు మిట్టాడుతోంది. వరుస ప్లాపులతో పాటు...ఓ పెద్ద హీరో కూతురుతో జరిగిన నిశ్చితార్థ వ్యవహారం బెడిసి కొట్టడమే ఉదయ్ కిరణ్ ఈ పిరిస్థతికి కారణమని పరిశ్రమ వర్గాల గుసగుస.
ఆ విషయం పక్కన పెడితే ఉదయ్ కిరణ్-శ్వేత బసు ప్రసాద్ నటించిన 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' సినిమా ఈ నెల డిసెంబర్ 16న విడుదల కావాల్సి ఉండగా విడుదలకు నోచుకోలేదు. సినిమా థియేటర్లలో పోస్టర్లు వేసిన తర్వాత కూడా చివరి నిమిషంలో వాయిదా వేశారు. వాస్తవానికి ఈ సినిమా గతంలో ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కొన్ని అసుకోని కారణాలతో కాలేదు. అయితే ఈ సారి కూడా మరోసారి వాయిదా పడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే దెబ్బమీద దెబ్బ రుచి చూసిన ఉదయ్ కిరణ్ కు ఈ వాయిదా అతని సినీ కెరియర్కి మరో దెబ్బలాంటిదే అంటున్నారు.
సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈశ్వర్ ప్రసాద్, డి కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సుభా సెల్వన్ దర్శకత్వం వహించారు.