Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అన్నవరంలో ప్రేమించిన అమ్మాయితో లవర్బాయ్ పెళ్లి
ఉదయ్ కిరణ్, విశితలు ప్రేమించుకొని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు. హైదరాబాద్కి చెందిన విశితను ఉదయ్ ప్రేమించారు. వారిద్దరి ప్రేమనీ ఇరు కుటుంబాల వారూ అంగీకరించి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ వివాహంతో తన దశ తిరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'జై శ్రీరామ్' అనే చిత్రంతో కొత్త ఇన్నింగ్స్కి శ్రీకారం చుట్టారు.
ఉదయ్ కిరణ్ ఈ విషయమై ఐదు రోజుల క్రితమే చెప్పారు. ''ఓ పుణ్యక్షేత్రంలో పెళ్లి చేసుకోబోతున్నాను. నిరాడంబరంగా ఆ వేడుక ఉంటుంది'' అని తెలిపారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'చిత్రం'తో హీరోగా ఉదయ్ తొలి అడుగువేశారు. ఆ తరవాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే'లాంటి చిత్రాలతో దూసుకెళ్లారు.
ఆ తరవాత కెరీర్పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఉదయ్ కిరణ్ సెకండ్ ఇన్నింగ్స్ తరహాలో మొదలెట్టి చేస్తున్న చిత్రం 'జై శ్రీరామ్'. రేష్మ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బాలాజీ ఎన్.సాయి దర్శకత్వం వహిస్తున్నారు. తేళ్ల రమేష్, ఎన్.సి.హెచ్.రాజేష్ నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ ''ప్రాణాల్నిపణంగా పెట్త్టెనా అనుకొన్నది సాధించే పోలీసు అధికారి పాత్రలో ఉదయ్కిరణ్ ఒదిగిపోయారు. యాక్షన్, వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది'' అన్నారు.