Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘మధుమతి’లో ఉదయభాను విచ్చలవిడితనం (ఫోటోలు)
హైదరాబాద్ : కడియం రమేష్ సమర్పణ లో శివ కుమార్, ఉదయ భాను హీరో హీరోయిన్లుగా రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో గోమాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై రాణి శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం 'మధుమతి'. ఇటీవల ఈచిత్రం గోదావరి నది పరిసర ప్రాంతాల్లో ఈచిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
మధుమతి సినిమా గురించి దర్శకుడు రాజ్ శ్రీధర్ మాట్లాడుతూ...'నేను ఉదయభానుకు సరిపోమే కథని 8 సంవత్సరాల క్రితమే తయారు చేసుకోవడం జరిగింది. విచ్చలవిడిగా తిరిగే ఒక తెలుగు అమ్మాయిని అనుకోని పరిస్థితులో తమిళ అబ్బాయి తన ఇంటికి తీసుకెళ్ళడంతో ఎదురయ్యే పరిణామాలును తనకి అనుగుణం ఎలా మలుచుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ. ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా చిత్రీకరిస్తున్నాం. 'మధుమతి' సినిమా ద్వారా ఉదయభాను ఉత్తమ నటిగా అవార్డు తీసుకుంటుందనే నమ్మకం ఉంది' అన్నారు.
చిత్ర సమర్పకులు కడియం రమేష్ మాట్లాడుతూ....'మా మధుమతి సినిమా మొత్తం గోదావరి బ్యాక్ డ్రాప్లో చిత్రీకరించాము. మార్చి మొదటి వారంలో షూటింగ్ మొదల పెట్టి మే 18 వరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసాం. మధుమతి క్యారెక్టర్ మేము ఊహించిన విధంగా ఉదయభాను తన నటనతో ప్రాణం పోసిందని చెప్పగలను. ఈ పాత్ర ద్వారా అలనాటి సావిత్రి, నిన్నటి జయసుధ గార్ల కోవలో ఉదయభాను నిలవడమే కాక మా మధుమతి సినిమాకి మంచి గుర్తింపుని తీసుకొస్తుందని ఆశిస్తున్నాం' అన్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫి : సత్య వి ప్రభాకర్, సంగీతం : రాజ్ కిరణ్, నిర్మాణం : రాణి శ్రీధర్, కథ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం : రాజ్ శ్రీధర్.
మధుమతిలో ఉదయభాను
ఈ చిత్రంలో ఉదయభాను విచ్చలవిడిగా తిరిగే అమ్మాయిగా నటిస్తోంది.
ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం రెండు మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.