Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్ ను మించిపోయిన రకుల్ ప్రీత్ సింగ్
హైదరాబాద్: రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రూస్ లీ'. ఈ నెల 16న సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో చిత్రీకరణ మిగిలి ఉన్న పాటలను పూర్తి చేయడానికి సినిమా టీం మొత్తం ఓవర్ టైం పని చేస్తూ శ్రమిస్తున్నారు.
సినిమాలోని ఓ పాట కోసం రామ్చరణ్ ఏకధాటిగా 17 గంటలు పనిచేసి ఆశ్చర్యపరిస్తే చిత్ర కథానాయిక రకుల్ప్రీత్ సింగ్ 24 గంటలు ఏకధాటిగా పనిచేసి ఆయన్ని మించిపోయింది. ఈ విషయమై రకుల్ మాట్లాడుతూ బ్రూస్లీ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సినిమాను అనుకున్న సమయానికి అందించాలని ప్రతి ఒక్కరం శ్రమించాం. చిత్రంలోని చివరి పాటను పూర్తిచేయడం కోసం నేను 24 గంటలు పనిచేయాల్సి వచ్చింది. ఇంత మంచి టీమ్తో పనిచేచే అవకాశం దక్కినందుకు ఆనందంగా వుంది అని తెలిపింది.
బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.
రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.
ఈ చిత్రాన్ని తమిళంలో ‘బ్రూస్ లీ-2' పేరుతో విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తమిళంలో ‘బ్రూస్ లీ' సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉండటంతో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు ‘బ్రూస్ లీ-2' అని పేరు పెట్టారు. బ్రూస్ లీ -2 ఆడియో అక్టోబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని భద్రఖాళీ ఫిల్మ్స్ తమిళంలో విడుదల చేస్తోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించటం అనే వార్త, శ్రీను వైట్లతో తొలిసారి చేయటం, ఇప్పటికే వదిలిన ట్రైలర్స్ సినిమా బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయేలా చేసాయి. దాంతో ఈ చిత్రం అన్ని ఏరియాలు అమ్ముడయ్యి...పదికోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
రామ్చరణ్, రకుల్ప్రీత్లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్ విజయ్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.