Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రంగస్థలం సక్సెస్ తర్వాత ఉపాసన ఆసక్తికరమైన ట్వీట్
మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం తొలి ఆట నుంచే మంచి టాక్ను సొంతం చేసుకొన్నది. ఓవర్సీస్ మార్కెట్లో భారీ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. ప్రేక్షకుల అండతో రంగస్థలం సినిమా దూసుకుపోతున్న నేపథ్యంలో రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని నీ ప్రేమకు దాసోహమయ్యాం అని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
బాబా.. నీవు మా కోసం ఏదైతో చేశావో.. ఏదైతే చేస్తున్నావో.. భవిష్యత్లో మాకు ఏం చేయబోతున్నావనే విషయానికి నీకు ధన్యవాదాలు అని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా రాంచరణ్, రంగస్థలం అని హ్యాష్ ట్యాగ్ చేసి సాయిబాబా ఫోటోను ట్వీట్ చేశారు.
Humbled by your love 🙏🏼 #RamCharan #rangasthalam pic.twitter.com/bKHo8r4H5Z
— Upasana Kamineni (@upasanakonidela) March 30, 2018
విభిన్నమైన చిత్రంగా రూపుదిద్దుకొన్న రంగస్థలం సినిమాపై ఉపాసన, రాంచరణ్ భారీగా ఆశలు పెట్టుకొన్నారు. దాదాపు రెండేళ్లు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సినిమా రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్ను సంపాదించుకొన్నది.