Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రంగస్థలం సక్సెస్ తర్వాత ఉపాసన ఆసక్తికరమైన ట్వీట్
మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం తొలి ఆట నుంచే మంచి టాక్ను సొంతం చేసుకొన్నది. ఓవర్సీస్ మార్కెట్లో భారీ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. ప్రేక్షకుల అండతో రంగస్థలం సినిమా దూసుకుపోతున్న నేపథ్యంలో రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని నీ ప్రేమకు దాసోహమయ్యాం అని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
బాబా.. నీవు మా కోసం ఏదైతో చేశావో.. ఏదైతే చేస్తున్నావో.. భవిష్యత్లో మాకు ఏం చేయబోతున్నావనే విషయానికి నీకు ధన్యవాదాలు అని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా రాంచరణ్, రంగస్థలం అని హ్యాష్ ట్యాగ్ చేసి సాయిబాబా ఫోటోను ట్వీట్ చేశారు.
Humbled by your love 🙏🏼 #RamCharan #rangasthalam pic.twitter.com/bKHo8r4H5Z
— Upasana Kamineni (@upasanakonidela) March 30, 2018
విభిన్నమైన చిత్రంగా రూపుదిద్దుకొన్న రంగస్థలం సినిమాపై ఉపాసన, రాంచరణ్ భారీగా ఆశలు పెట్టుకొన్నారు. దాదాపు రెండేళ్లు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సినిమా రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్ను సంపాదించుకొన్నది.