కరోనా ఎఫెక్ట్ : అలాంటి వారంతా హృదయం లేని వారే.. మెగా కోడలు ఫైర్
కరోనా మహమ్మారికి జనమంతా బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. రోజు రోజుకు పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఇప్పటికే కరోనా కేసులు 400లకు చేరువగా ఉన్నాయి. తెలంగాణ, ఏపీలోనూ పరిస్థితులు విషమించుతున్నాయి. కరోనా కట్టడికి తీసుకున్న లాక్ డౌన్ చర్య వల్ల ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. దీని వల్ల కరోనా కాస్త అదుపులో ఉన్నట్టు కనిపిస్తోంది.

రూమర్స్ హల్చల్..
అయితే ఈ లాక్ డౌన్ సమయంలో వాస్తవ వార్తలకంటే రూమార్సే ఎక్కువగా వ్యాప్తి చెందడం ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలో పెంపుడు జంతువుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే రూమర్స్ పుట్టించడం వల్ల వాటిని అనాథల్లా వదిలేస్తున్నారు.

వదిలించుకుంటున్న వారెందరో..
పెంపుడు జంతువులైన కుక్కల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందున్న రూమర్స్ రావడంతో చాలా మంది వాటిని వీధుల్లోనే వదిలేశారు. దీంతో కొందరు వాటిపై కఠినంగా కూడా వ్యవహరించారు. అయితే అవన్నీ రూమర్స్ అని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు.
మూగజీవాల పట్ల ప్రేమను..
మూగజీవాల పట్ల ప్రేమను చూపించండని యాంకర్ రష్మీ కోరుకున్న సంగతి తెలిసిందే. కుక్కలకు ఆహారం అందించేందుకు స్వయంగా రంగంలోకి దిగింది. స్వచ్చంద సంస్థతో కలిసి మూగ జీవుల సంరక్షణార్థం బయలు దేరింది.
Recommended Video

అలాంటి వారి హృదయం లేని వారు..
తాజాగా మెగా కోడలు ఉపాసన స్పందిస్తూ.. ‘నా డార్లింగ్ డైసీ స్వీయ నిర్భందం వర్తించదు.. మూగ జీవాల పట్ల మీరెంత ప్రేమను చూపిస్తారో తెలిపే సమయం ఇది.. కొందరు హృదయం లేని కొందరు వాటిని వీధుల్లోనే వదిలేస్తున్నారు.. అది అత్యంత క్రూరమైన చర్య. మూగజీవాల పట్ల మీరు చూపే ప్రేమే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది' అని పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











