Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
క్వారంటైన్లో రామ్ చరణ్తో ఉపాసన.. పాజిటివ్ వచ్చే చాన్స్.. మెగా కోడలు పోస్ట్ వైరల్
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడేలా కనిపిస్తోంది. మెగా ఇంట్లో వరుసగా ఈవెంట్లు జరగడం అందరి కొంప ముంచేలా ఉన్నాయి. చివరగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మెగా కజిన్స్ అందరూ రచ్చ చేశారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. కరోనా పాజిటివ్ వచ్చిందని రామ్ చరణ్ ప్రకటించిన కొద్ది గంటలోనే వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడటం అందరినీ షాక్కు గురి చేస్తోంది. తాజాగా ఉపాసన చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.
రామ్ చరణ్కు పాజిటివ్..
రామ్ చరణ్కు కరోనా పాజిటివ్ అని ప్రకటించడంతో అందరూ అందోళన చెందుతున్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసన ఒకే ఇంట్లో ఉంటారు. దీంతో ఉపాసనకు కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రెండ్రోజుల క్రితం రామ్ చరణ్ ఆచార్య సెట్లో సందడి చేయడంతో.. యూనిట్ మొత్తం ఆందోళనలో పడింది.
మెగా ఇంట్లో కరోనా..
రామ్ చరణ్ పాజిటివ్ వచ్చిందంటూ ప్రకటించిన కొన్ని గంటలకే వరుణ్ తేజ్ కూడా ఓ ప్రకటన చేశాడు. తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఉలిక్కి పడిన్టటు తెలుస్తోంది. క్రిస్మస్ వేడుకల కేంద్రంగానే కరోనా వైరస్ ఎంట్రీఇచ్చినట్టుకనిపిస్తోంది.
వచ్చే అవకాశం..
రామ్ చరణ్తో తాను క్వారంటైన్లో ఉన్నానంటూ ఉపాసన తెలిపింది. ఈ గడ్డుకాలం కూడా గడిచిపోతుంది.. 2021లో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.. కరోనా లక్షణాలేవీ కనిపించడం లేదు.. ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు.. నాకు కూడా పాజిటివక వచ్చే అవకాశం ఉంది.. పరీక్షలు చేస్తే మాత్రం నెగెటివ్ వచ్చిందంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.
క్వారంటైన్లో ఇద్దరూ..
రామ్ చరణ్ పాజిటివ్ తేలడంతో క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు.అయితే రామ్ చరణ్ వెంట ఉపాసన కూడా ఉంది. ఇదే విషయాన్ని చెబుతూ.. క్వారంటైన్ను మిస్టర్ సీతో గడుపుతున్నానంటూ ఫోటోను షేర్ చేసింది. వేడి వేడి ద్రవాలు, ఆవిరి, విశ్రాంతి వంటివి తీసుకుంటున్నామని చెప్పుకొచ్చింది.