Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వారెవా ఉపాసన కొణిదెల.. 50 కోట్ల కుటుంబాల కోసం మెగా కోడలు భారీ ప్లాన్
అపోలో హాస్పిటల్ యాజమాన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాసన కొణిదెల మరో తన మానవత్వాన్ని చాటుకొన్నారు. పేదలు, ఆర్థికంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించిన ప్రతీసారి ఉపాసన తన సామాజిక బాధ్యతను గుర్తు చేసుకొంటారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనావైరస్ పరిస్థితులు కుదిపేస్తున్న సమయంలో ఉపాసన తనదైన శైలిలో స్పందించారు. పేద ప్రజలకు ఆరోగ్య భీమా గురించి వెల్లడిస్తూ..
Recommended Video
పేదలకు అందుబాటులో ఆరోగ్య భీమా అంటూ
మీకు ఆరోగ్య భీమా ఉందా? మీరు ఎప్పుడైనా కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ పాలసీ గురించి విన్నారా? అంటూ ఉపాసన కొణిదెల ట్విట్టర్లో స్పందించారు. 50 కోట్ల మంది మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్యానికి చక్కటి పరిష్కారం ఇది. ఆరోగ్య పరమైన ఎలాంటి ప్రభుత్వ స్కీములు లేదని వారికి అండగా ఉండటానికి రూపొందించిన భీమా పాలసీలు ఇవి. చాలా తక్కువ రుణంతోనే ఇలాంటి పాలసీలు చేయించుకోవచ్చు అని ఉపాసన చెప్పారు.
మధ్య తరగతి భారతీయ కుటుంబాలకు
ఆరోగ్య భీమా లేని మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలువడానికి మేము రెడీగా ఉన్నాం. అనారోగ్య పరిస్థితులు ఎంతో మందిని పేదరికంలోకి నెడుతున్నాయి. పేదలు కూడా భరించే తక్కువ మొత్తానికే మేము ఆరోగ్యసంరక్షణకు కట్టుబడి ఉన్నాం అంటూ ఉపాసన కొణిదెల తన ట్వీట్లో సమాచారం అందించారు.
50 కోట్ల మంది భారతీయ కుటుంబాలకు
మధ్య తరగతికి చెందిన 50 కోట్ల భారతీయ కుటుంబాలకు అండగా నిలువడానికి ముందుకొచ్చాం. పలు ఇన్పూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వాలతో కలిసి ప్రజారోగ్యానికి పూనుకోవాలని నిర్ణయించుకొన్నాం. మధ్య తరగతి కుటుంబాలకు సరితూగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చాం అంటూ అపోలో హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున ట్వీట్ చేశారు.
పలు రాష్ట్రాల్లో తక్కువ ధరకే ఇన్సూరెన్స్
అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించిన వీడియోను ఉపాసన షేర్ చేశారు. ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో మధ్య తరగతి ఎలా అండగా నిలుస్తున్నామనే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. అందరికీ ఆరోగ్యం అందించడమే తమ లక్ష్యమని ట్వీట్లో పేర్కొన్నారు.