Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ టైటిల్ మార్చకుంటే ఉద్యమమే: హెచ్చరించిన బ్రాహ్మణ సంఘం
ఉపేంద్ర, సలోని, రాగిణి ద్వివేది హీరో హీరోయిన్లుగా 'బ్రాహ్మణ' చిత్రం రానుంది. శ్రీనివాస్ రాజు డైరెక్షన్ లో వచ్చిన కన్నడ చిత్రం 'శివం' ఘన విజయం సాధించింది. ఇదే సినిమాని ఇప్పుడు బ్రహ్మణ పేరుతో తెలుగులోకి డబ్ చేసారు. అయితే టైటిల్ "బ్రాహ్మణ" వెంటనే మార్చాలని, కులం పేరుతో సినిమాలు తీస్తే బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటాయని "బ్రాహ్మణ్స్ యూనిట్ ఫర్ ఎవర్ కో ఆర్డినేటర్స్" ఆలూరి, గోగులపాటి కృష్ణమోహన్, పిల్లుట్ల ఆనంద్ మోహన్ డిమాండ్ చేశారు.
బుధవారం ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి తుమ్మా విజయ్కుమార్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే బ్రాహ్మణులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని, దీనికి తోడు సినిమా టైటిళ్లకు కూడా ఆ పేర్లు పెట్టడం, సినిమాల్లో వేష, భాషలను అపహాస్యం చేస్తూ బ్రాహ్మణులను కించపరుస్తున్నట్లు వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇక నుంచి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలు తీస్తే సహించేది లేదన్నారు.
నిజామా బాద్ లోని గాయత్రీ ధార్మిక వేదిక జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్శర్మ కూడా ఇదే డిమాండ్ని చేసారు. ఎల్లమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో అర్చక సమాఖ్య ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడారు.
నిత్యం దేవతారాధన, దీపారాధనలతో పాటు లోకకల్యాణార్థం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న బ్రాహ్మణులపై దాడులు జరపటమే కాకుందా సినిమాలకు పేర్లు పెట్టి తమను కించపరుస్తూ. బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. సినిమా పేరు మార్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూడా వారు హెచ్చరించారు.